లక్షెట్టిపేట, మార్చి 4 : ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధంలాంటిదని స్వీప్ నోడల్ అధికారి, మంచిర్యాల ఆర్డీవో కిషన్ అన్నా రు. పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో సోమవారం ఓటు వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. 18 ఏండ్లు రాగానే ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట తహసీల్దార్ రాఘవేంద్రరావు, కళాశాల ప్రిన్సిపాల్ జైకిషన్ ఓజా, ఎలక్టోరల్ ప్రచారకర్త సంధ్యారాణి, స్వీ ప్ నోడల్ కో-ఆర్డినేటర్లు రాంచందర్, కుమా ర్, ఏపీవో వెంకటరమణ, ఎంపీఎం లక్ష్మి, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.