తలమడుగు, జూన్ 7: రైతన్న కోసం గ్రామస్తులు దండులా కదిలారు. మేమున్నామంటూ అండగా నిలిచారు. పొలాన్ని చదును చేసి ధైర్యం నింపారు. ఆ వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కుచులపూర్కు చెందిన రైతు లింగన్న 25 ఏండ్ల క్రితం పల్సి(కే)లో 24 సర్వే నంబర్లో నాలుగెకరాల భూమిని బాబుసేట్ వద్ద కొనుగోలు చేశాడు.
అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నాడు. సోమవారం అబ్దుల్ బాబుసేట్, అబ్దుల్ సాజీద్, రజాక్ భూమి తమది అంటూ కబ్జాలోకి తీసుకొని పంట వేశారు. దీంతో రైతు లింగన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం పొలంలో లింగన్నతోపాటు గ్రామస్తులు పంటను తొలిగించి భూమిని చదును చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు.