కాసిపేట, ఫిబ్రవరి 15: మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే, మైనింగ్ విస్తరణకు ఎటువంటి అ భ్యంతరాలు లేవని దేవాపూర్ గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేవాపూర్ పంచాయతీ ఆవరణలో ఓరియంట్ సిమెంట్ కంపెనీ మైనింగ్ గని 2 విస్తరణ కోసం తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ లిమిటెడ్(టీఎస్ఎండీసీ) ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.
అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ హాజరై స మావేశంలో మైనింగ్ విస్తరణకు సంబంధించి 588.26 హైక్టర్ల అటవీ భూమి అవసరం కాగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించామని, అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను పర్యావరణ, టీఎస్ఎండీసీ అధికారు లు సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా స్థానిక ఆదివాసీలు మాట్లాడుతూ కంపెనీ అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అని ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో హామీలిస్తూ, తర్వాత పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మూడు ప్లాంట్లు ఏర్పాటు చేసిన సమయంలో ఇలాగే హా మీలతో కాలం గడిపింది తప్పితే స్థానిక ఆదివాసీలు, ని రుద్యోగులకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓరియంట్ మైనింగ్ లీజుకు సంబంధించి గట్రావ్పల్లి, దేవాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో భూములు అవసరం ఉంది. అయితే ఎక్కువ భూమి తమ పరిధిలో ఉందని, గట్రావ్పల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించకపోవడంతో, గ్రామస్తులు బహిష్కరించి ఓరియంట్ క్వారీ ఎదుట బైటాయించారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టగా రాత్రి వరకు కొనసాగింది.
పర్యావరణ శాఖ ఇంజినీరింగ్ అధికారి లక్ష్మణ్ ప్రసాద్, టీఎస్ఎండీసీ, పర్యావరణ శాఖ అధికారులు, ఓరియంట్ కంపెనీ అధికారులు, ఓరియంట్ సిమెంట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సత్యపాల్రావు, డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏసీపీ రవికుమార్, సీఐ దేవయ్య, నాయకులు బొల్లు రమణారెడ్డి, పూస్కూరి వంశీకృష్ణారావు, తిరుపతిరెడ్డి, మడావి అనంతరావు, ఆడె జంగు, రొడ్డ రవికుమార్, దండవేణి చందు, కాసిపేట, దేవాపూర్, రామకృష్ణాపూర్ ఎస్ఐలు గంగారాం, ఆంజనేయులు, రాజశేఖర్, గ్రామస్తులు పాల్గొన్నారు.