ఉమ్మడి జిల్లాలో పులులు దడ పుట్టిస్తున్నాయి. అటవీ ప్రాంత గ్రామాల్లో సంచరిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నిత్యం ఎక్కడో చోట పశువులపై దాడి చేస్తూ చంపివేస్తున్నాయి. రెండేళ్ల క్రితం దహెగాం మండలం దిగడ గ్రామానికి చెందిన విఘ్నేష్(24), పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన నిర్మల (15)ను పొట్టనబెట్టుకోగా, తాజాగా మంగళవారం ఓ పులి మరో వృద్ధుడిని బలితీసుకున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం చౌపన్గూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఖానాపూర్కు చెందిన సిడాం భీము (69) తన చేనులో పత్తి ఏరుతుండగా దాడి చేసి హతమార్చింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 15(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లాలో పులుల దాడులు కలకలం రేపుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో పులుల సంచారం పెరిగింది. పశువులపై దాడులు సర్వసాధారణంగా మారాయి. గతేడాది దాదాపు 120 పశువులపై దాడులు చేశాయి. ఈ ఘటనల్లో సుమారు 70 పశువులు ప్రాణాలు కోల్పోయాయి. వారం కిం దట ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గూడ గ్రా మ శివారులో పెన్గంగ కాలువలో రెండు పులులు కనిపించగా, రెండు రోజుల క్రితం పిప్పల్కోటీ ప్రాంతంలో నాలుగు పులులు రోడ్డు దాటుతూ కనిపించాయి. గతేడాది ఎక్కువగా ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్, పెంచికల్పేట్, దహెగాం మండలాల్లోని ప్రాణహిత అటవీ ప్రాంతాల్లో పులుల సంచారం ఉండగా, ఈ ఏడాది వాంకిడి, ఆదిలాబాద్ సరిహద్దులోని పెన్గంగ సరిహద్దుల్లో పులుల అలజడి ఎక్కువగా ఉంటోంది. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్, ఇంద్రావతి అభయారణ్యాల నుంచి పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ల నుంచి పెన్గంగ, ప్రాణహిత నదులను దాటుకొని కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లోకి ప్రవేశిస్తున్నా యి. ఇక్కడ స్థిర నివాసం ఏర్పర్చుకుంటున్నాయి. ఈ క్రమంలో అటవీ ప్రాంతాల స మీపంలోని గ్రామాల్లో మూగజీవాలపైనేగాకుండా మనుషులపైనా దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజన గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
దడపుట్టిస్తున్న దాడులు
ఉమ్మడి జిల్లాలో పులిదాడులు దడపుట్టిస్తున్నాయి. పశువులతో పాటు చేలల్లో పనిచేసే మనుషులపైనా పంజా విసురుతున్నాయి. రెండు రోజుల క్రితం వాంకిడి మండలం గొండపూర్ గ్రామంలో పశువుపై పులి దాడిచేసింది. గ్రామస్తులు కేకలు వేయడంతో దానిని వదిలి పారిపోయింది. 2020, నవంబర్ 11న దహెగాం మండలం దిగడ గ్రామానికి చెందిన విగ్నేష్ చేపల వేటకు వెళ్లగా పులి దాడి చేసి చంపింది. ఈ ఘటన మరువక ముందే 2020 నవంబర్ 29న పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన నిర్మల (15) పత్తి ఏరుతుండగా, పెద్ద పులి దాడి చేసి చంపింది.
సరిహద్దులో పులి అలజడి
భీంపూర్, నవంబర్15: గుంజాల అటవీ ప్రాంతం లో సోమవారం ఆవుదూడను హత మార్చిన పెద్దపులి మంగళవారం కూడా పశు మందలపై దాడి చేసింది. పిప్పల్రోటి రైతు పిట్ల బాబాన్న తన ఆవుదూడను మందతో అడవిలో మేతకు పం పాడు. అయితే మందలో ఒక్కసారిగా అలజడి రేగ డంతో కాపరి భయంతో పొదల మాటుకు వెళ్లాడు. ఈ క్రమంలో పులి ఆవుదూడపై పంజా విసిరి గాయపరిచింది. పక్కనున్న వారి కేకలతో పులి వెళ్లిపోగా దూడను ఇంటికి తీసుకు వచ్చి చికిత్స చేయించారు. అలాగే గొల్లగఢ్ ప్రాం తంలో కూడా ఆవుల మందపై దాడికి యత్నిం చిందని స్థా నికులు చెప్తున్నారు. కాగా ఈ ప్రాంతం లో అటవీశాఖ అధికారులు సీసీ నైట్ విజన్ కెమె రాలు, బేస్ క్యాంపులతో పులి సంరక్షణ చర్యలు చేపడుతు న్నారు. ఎఫ్ఆర్వో గులాబ్సింగ్, ఎఫ్ ఎస్వోలు ప్రేంసింగ్ ,గులాబ్ , ఎఫ్బీవోలు , యానిమల్ ట్రా కర్స్తో నిత్యం విధులు నిర్వహిస్తున్నారు.
పులిదాడిలో కోడె మృతి
దహెగాం,నవంబర్15 : మండలంలోని ఖర్జీ గ్రామానికి చెందిన లంగారి వెంకటేశ్ కోడె పెద్దపులి దాడిచేయడంతో మృతి చెందింది. కాగా ఈ వి షయాన్ని అటవీ శాఖ అధికారలకు సమాచారం ఇచ్చినట్లు బాధితుడు తెలిపారు.
పత్తి ఏరుతుండగా ..
వాంకిడి, నవంబర్ 15 : కుమ్రం భీం ఆసిఫా బాద్ జిల్లా వాంకిడి మండలం చౌపన్గూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఖానాపూర్కు చెందిన ఆదివాసీ రైతు సిడాం భీము(69) పులిదాడిలో మృతి చెందాడు. మంగళవారం ఉదయం గ్రామ సమీపంలోని ధర్మగుట్ట ప్రాం తంలోని తన చేనుకు కుటుంబ సభ్యులతో కలిసి పత్తి ఏరేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులంతా భోజనం చేస్తుండగా, భీము ఒక్కడే పత్తి ఏరుతున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పులి ఆయనపై దాడి చేసి కొండప్రాంతం నుంచి దిగువ(లొద్ది)కు ఈడ్చుకెళ్తుండగా, పక్క చేనులో ఉన్న రైతు జాదవ్ శ్రావణ్ గమనించి కేకలు వేశాడు. కొంద దూరంలో పోడుభూములు సర్వే చేస్తున్న అధికారులు, రైతులు అక్కడికి పరిగె త్తుకొచ్చి కేకలు వేయడంతో భీముని వదిలి అడ విలోకి పారిపోయింది. అప్పటికే అతడు చనిపో యాడు. మృతదేహాన్ని గుట్ట కిందికి దింపి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా అటవీ అధికారి దినేశ్కుమార్, ఎఫ్ఆర్వో అప్పల కొండ, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరి శీలించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమా రులు, కూతురు ఉంది. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సాయంగా రూ. 10 వేలు అందించారు. ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షలు అందించి ఆదుకుంటామని హామీనిచ్చారు.