ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 6 : హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాకేంద్రంలోని శాంతినగర్ సాయిబాబా ఆలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వహిం దూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో గురువారం సాయంత్రం నిర్వహించిన వీర హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. గోపాలకృష్ణ మఠం వద్ద ఎమ్మెల్యే జోగు రామన్న ర్యాలీని ప్రారంభిం చారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన యువకులు కాషాయ జెండాలతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొనగా శోభాయాత్ర ఆసాంతం జై హనుమాన్ నినాదాలతో హోరెత్తించారు. పోలీ సులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి పాల్గొన్నారు.