ఉట్నూర్రూరల్, డిసెంబర్ 9 : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈ నెలాఖారులోగా పూర్తి చేయాలని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని హస్నాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 18ఏళ్లు నిండిన వారు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. డీఎంహెచ్వో వెంట డీపీవో శ్రీనివాస్, డీఎల్పీవో భిక్షపతిగౌడ్, ఎంపీవో మహేశ్, డాక్టర్ విజయ్కుమార్ ఉన్నారు.
జిల్లా కేంద్రంలోని కుమ్మరివాడ, శ్రీరాంకాలనీలో కౌన్సిలర్ రామెల్లి శ్రీలత, ప్రత్యేకాధికారి ప్రసాద్ ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్ వేయించారు. వారి వెంట ఏఎన్ఎంలు జ్యోతి, అనురాధ, ఆశకార్యకర్తలు సుజాత, రజిత, మున్సిపల్ సిబ్బంది కిరణ్ ఉన్నారు.
ప్రాణ రక్షణ కోసమే టీకా
ప్రాణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సర్పంచ్ రాకేశ్ అన్నారు. మండల కేంద్రంతో పాటు డోప్టాల, సిర్సన్న గ్రామాల్లో వాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి డోస్ తీసుకున్న వారు రెండవ డోస్ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం లలిత, ఆశ కార్యకర్త కవిత, ఐకేపీ సిబ్బంది ఉన్నారు.