దస్తురాబాద్, మే 8 : దస్తురాబాద్ మండలంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిశాయి. అక్కడక్కడ కోతకు వచ్చిన వరి చేలు నేలకొరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడవకుండా రైతులు కవర్లు కప్పుతూ తిప్పలు పడ్డారు. శుక్రవారం ఆరబెట్టేందుకు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వడ్లు కొనాలని రైతులు కోరుతున్నారు.
లక్ష్మణచాంద, మే 8 : లక్ష్మణచాంద మండలంలో గురువారం రాత్రి కురిసిన వానతో కొనుగోలు వడ్లు, మక్కలు తడవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. పారుపెల్లి గ్రామంలో సబ్సెంటర్ పరిధిలో లారీల కొరత, గన్నీ బ్యాగులు, అధికారుల అలసత్వంతో మక్కలు, వడ్ల కొనుగోళ్లు జాప్యమవుతున్నాయని రైతులు తెలిపారు. 20 లారీలకు గాను 3 లారీలను మాత్రమే అధికారులు కొనుగోలు చేశారు. 25 రోజులు క్రితం మక్కలు తీసుకువచ్చామని, ఇప్పటికీ కొనలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు మెరుగు గోపాల్, మధు, భీమేశ్ కోరారు.