ఎదులాపురం, జూన్ 13 : ఆన్లైన్ జీరో పర్మిట్ సిస్టమ్పై అవగాహన సమావేశం శుక్రవారం కలెక్టరేట్లో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సంబంధిత కార్యనిర్వాహక శాఖ అధికారులు, కాంట్రాక్టర్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆన్లైన్ జీరో పర్మిట్ సిస్టమ్ని జిల్లాలో అమలు పరచాలన్నారు.
గనులు, భుగర్భశాఖ, సహాయ సంచాలకులు ఇన్చార్జి సంబంధిత కార్యనిర్వాహక శాఖ ఆధికారులు, కాంట్రాక్టర్లకు ఆన్లైన్ జీరో పర్మిట్ సిస్టమ్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీ మైన్స్ రమేశ్, కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు పాల్గొన్నారు.