కడెం, డిసెంబర్ 2 : కడెం జలాశయం నుంచి ఐదు మండలాల ప్రజలకు తాగునీరు అందిం చాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరింది. గతంలో వేసవికాలంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు కోట్ల రూపాయల నిధులు వెచ్చించింది. మిషన్ భగీరథ పథకం కింద ప్రజలకు తాగునీటి కష్టాలు తీర్చేందుకు శ్రీకారం చుట్టి ఆ దిశగా కడెంలో పనులు పూర్తి చేశారు. కడెం మండలంతో పాటు, ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్, జన్నారం మండలాల్లోని 297 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రభు త్వం రూ. 280 కోట్ల నిధులతో నిర్మాణ పనులు పూర్తి చేసి, ఇబ్బందులు తీర్చారు.
కడెం జలా శయంలో ఇంటెక్వెల్ నిర్మించి దాని ద్వారా మంచినీటి శుద్ధి కేంద్రానికి(ఫిల్టర్బెడ్) వరకు పైప్లైన్ అమర్చి నీటిని అందిస్తున్నారు. అయితే మొదటి విడుతగా రూ. 30 కోట్ల ద్వారా శుద్ధజల ప్లాంట్ నిర్మాణం పనులను చేపట్టారు. రెండో విడుతలో రూ. 250 కోట్లతో ఇంటెక్వెల్ నిర్మా ణంతో పాటు ఐదు మండలాల్లోని గ్రామాలకు ఫైపులను అమర్చి, ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందించేలా ట్యాంకులు, పైప్లైన్ పనులు పూర్తి చేశారు.
ఇక్కడ నిర్మించిన ఫిల్టర్ బెడ్లో ప్రతి రోజూజు (23 లక్షల ఎంఎల్డీ- మిలియన్ లీటర్ ఫర్ డే) నీటి సామర్థ్యంతో నీటిని అందిస్తున్నారు. ఇంటెక్వెల్ నుంచి మంచి నీటి శుద్ధజలం కేంద్రం వరకు 1.2 కిలో దూరం లో 240 పైపులను అమర్చారు. 2017 డిసెం బర్ నుంచి అన్ని గ్రామాలకు నీటి సరఫరా చేస్తున్నారు. నియోజకవర్గంలో అనేక ఏజెన్సీ గ్రామాలున్నాయి. ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఐదు మండలాల్లోని 297 గ్రామాలకు నిత్యం నీటిని సరఫరా చేస్తున్నారు. 100 మంది సిబ్బందితో అన్ని గ్రామాలకు ట్యాంకుల నిర్వ హణ, నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
కడెం మండలకేంద్రంలోని ఇంటెక్వెల్ నుంచి 23 ఎంఎల్డీ వరకు (మంచినీటి శుద్ధి కేంద్రం) వరకు వెళ్లిన నీటిని అక్కడే ఫిల్టర్ చేసిన అధికా రులు ఐదు మండలాల కోసం మూడు బ్యాలె నింగ్ వాటర్ ట్యాంకుల వరకు పంపిణీ చేస్తారు. అయితే ఇది కడెం మండలంలోని అంబారిపేట, ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి, పెంబి మండలంలోని నాగపూర్లో నిర్మించారు. అంబా రిపేట, సత్తెనపల్లి గ్రామాల్లో నిర్మించిన బ్యాలె నింగ్ ట్యాంకుల కేపాసీటీ 250 కేఎల్ కాగా, పెంబి మండలంలోని నాగపూర్ ట్యాంకు కెపా సిటీ 40 కేఎల్.
అయితే అంబారిపేట ట్యాంకు కడెం, దస్తురాబాద్, జన్నారం మండలాలకు నీటిని సరఫరా చేస్తుండగా, సత్తెనపల్లి ట్యాంకు ద్వారా ఖానాపూర్ మున్సిపాలిటీతో పాటు, ఖానా పూర్ మండలానికి సరఫరా చేస్తున్నారు. అలాగే నాగపూర్ ట్యాంకు ద్వారా పెంబి మండలానికి నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ మూడు ట్యాం కుల ద్వారా 297 గ్రామాల్లోని ట్యాంకులకు నిత్యం నీటిని సరఫరా చేస్తునారు. ఈ ట్యాంకుల పరిమాణం పెద్దది కావడంతో మంచినీటి శుద్ధి కేంద్రం నుంచి ఈ ట్యాంకుల్లోకి చేరవేసి వాటి ద్వారా క్రమంగా గ్రామాల్లోని ట్యాంకులకు తరలి స్తున్నారు. ఈ 297 గ్రామాలను ఆపరేట్ చేయ డానికి 100 మంది సిబ్బంది అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తున్నారు.
కడెం మండల కేంద్రంలోని 23 ఎంఎల్డీ ద్వారా నిత్యం ఐదు మండలాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నాం. ఖానాపూర్ మున్సిపాలిటీతో సహా, ఐదు మండలాల్లోని 297 గ్రామాలకు తాగునీటి సరఫరా కొనసాగుతుంది. పైపులైన్, ట్యాంకుల నిర్వహణ ఆర్డబ్ల్యూఎస్ అధికా రులతో పాటు, ఫిల్టర్కు సంబంధించిన పనులు మిషన్ భగీరథ సిబ్బంది ద్వారా నిత్యం పర్య వేక్షణతో చేపడుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరాను కొనసాగిస్తున్నాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పోయాయి.
– వెంకటరమణ, డీఈ, మిషన్ భగీరథ(కడెం)