కడెం, జూన్29: అతివేగంగా..అజాగ్రత్తగా ద్విచక్రవాహనం నడిపి, చెట్టుకు ఢీకొని ఇ ద్దరు యువకులు మృతి చెందిన ఘటన పె ద్ద బెల్లాల్లో చోటు చేసుకుంది. స్థానిక ఎ స్ఐ కొసాన రాజు తెలిపిన వివరాల ప్రకా రం.. కడెంకు చెందిన మహ్మద్ జిహాన్ (18), సయ్యద్ సమీయుద్దీన్(18) బక్రీద్ సందర్భంగా చిన్న బెల్లాల్ గ్రామంలోని మి త్రుల వద్దకు బయల్దేరారు. పెద్ద బెల్లాల్ శి వారులోని చెరువు వద్ద చెట్టుకు ఢీకొనడం తో సయ్యద్ సమీయుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలపాలైన మహ్మ జిహాన్ను ఖానాపూర్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందా డు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
కుటుంబసభ్యుల ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బక్రీద్ పండుగ రోజే, ఇద్దరూ మృతి చెందడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. స య్యద్ సమీయుద్దీన్ తండ్రి దస్తురాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు ని ర్వహిస్తున్నాడు. మహ్మద్ జిహాన్ తండ్రితో పాటు చికెన్ సెంటర్ నడుపుతున్నారు.