ఇచ్చోడ, డిసెంబర్ 24 : ఇచ్చోడలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పలు ప్రైవేట్ దవాఖానల్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లా వైద్యాధికారి రాథో డ్ నరేందర్ ఆదేశాల మేరకు మండల వైద్యాధికారి సాగర్ ఆధ్వర్యం లో శనివారం తనిఖీలు నిర్వహించారు. సరైన వసతులు లేకుండా నడుపుతున్నారన్న ఫిర్యాదుతో సాయిరాం, తుల సీ, సురేఖని, లక్ష్మి, రాజ్ వైద్యశాలలు, రవి, మణికంఠ క్లినిక్లను తనిఖీ చేశారు. అనుమతులు లేని శ్రీరామ, లక్ష్మి దవాఖానలను సీజ్ చేశారు.
మరో మూడు వైద్యశాలలకు షోకాజ్ నోటీసులిచ్చామని డాక్టర్ సాగర్ తెలిపారు. దవాఖానల్లో సరైన సదుపాయాలు లేకపోవడంతో రెండింటిని సీజ్ చేశామని పేర్కొన్నారు. మిగతా దవాఖానల్లో గుర్తించిన లోపాలపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులకు విచారణ నివేదికను అందజేస్తామన్నారు. రమేశ్కుమార్ గతంలో అందించిన వైద్యం వికటించి షేక్ ఇమ్రాన్ బీ మృతిచెందిందన్న ఆరోపణతో మణికంఠ క్లినిక్లో విచారణ చేశామని చెప్పారు. ఈ క్లినిక్ను మూసివేశామని తెలిపారు. ఆయన వెంట జిల్లా మాస్ మీడియా అధికారి వెంకట్ రెడ్డి, ఉత్తం, హెల్త్ సూపర్వైజర్ కైలాస్, సుభాష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.