ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో పండగపూట విషాదం నెలకొంది. కరోనాతో బారినపడిన ఇద్దరు అటవీ అధికారులు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందారు.
నార్నూరు మండలంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్ఎస్ఓ)గా విధులు నిర్వహిస్తున్న ఈశ్వర్ (55), ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్బీఓ)సునీల్ (36) కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
వీరిద్దరూ ఇటీవల కరోనా బారినపడి చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఉగాది పర్వదినాన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి