నార్నూర్,జనవరి 2:ఉట్నూర్ మండలం దంతన్పల్లి పంచాయతీ పరిధిలోని మానిక్గూడకు చెందిన కొలాం గిరిజనులు మహారాష్ట్రలోని మానిఘడ్కు భీమల్పెన్తో పాదయాత్రగా పయనమయ్యారు. ఆదివారం నార్నూర్ మండలం గంగాపూర్కు చేరుకొని బస చేశారు.
సోమవారం భీమల్దేవుళ్లతో కాలినడకన మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడ తమ దేవుళ్లకు జలాభిషేకం చేసి, మొక్కులు చెల్లించుకుంటామని గిరిజన పెద్దలు తెలిపారు. వారం తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుందన్నారు. కార్యక్ర మంలో కొడప రాజుపటేల్, దేవారి కొడప జంగు, కొడప మారుతి, కొడప గంగారామ్, కొడప భీంరావ్, చిన్నాపెద్దలు ఉన్నారు.