రాష్ట్ర సర్కారు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రభుత్వ బడులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పిస్తున్నది. తాజాగా ‘మన ఊరు-మన బడి’ పేరిట కార్యక్రమాన్ని చేపట్టి బడులను నూతనంగా తీర్చిదిద్దింది. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించడం.. మోడల్, గురుకుల, కస్తూర్బా పాఠశాలలను నెలకొల్పడం వంటివి చేస్తున్నది. విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్స్, బుక్స్ అందజేస్తున్నది. తాజాగా.. ప్రభుత్వ బడులు లేని గ్రామాలు, ఆవాసాల్లో ఉంటూ చదువుకుంటున్న ఆర్థిక స్థోమత లేని విద్యార్థులకు సర్కారు చేయూత అందిస్తున్నది. ఇంటి నుంచి బడికి వెళ్లి రావడానికి రవాణా చార్జీలను అందజేస్తున్నది. వచ్చే విద్యాసంవత్సరానికి నిధులు కూడా మంజూరు చేసింది. ఫలితంగా.. ఆటోలు, వ్యాన్లలో స్కూల్కు వెళ్తున్న నిరుపేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
– మంచిర్యాల, మార్చి 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, మా ర్చి 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభు త్వ బడులు లేని పల్లె లు, చిన్నచిన్న ఆవాసాల్లో ఉంటూ పొరుగురిలోని ప్రభుత్వ బడిలో చదువుకునేందుకు వెళ్తున్న విద్యార్థులకు ర వాణా ఖర్చులను రాష్ట్ర సర్కారు అం దజేస్తున్నది. వచ్చే విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో 30,395 మంది విద్యార్థులు సాయం అందుకోనుండగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3,736 విద్యార్థులు అర్హులుగా ఉన్నారు. వీరందరికీ స్కూల్కు వెళ్లి వచ్చేందుకు రవాణా చార్జీల కింద ప్రతినెలా రూ.600 చొప్పున అందజేయనున్నా రు. ఈ మేరకు వచ్చే విద్యాసంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.18.23 కోట్లు మంజూరు చేసింది. ఉమ్మడి ఆ దిలాబాద్ జిల్లాకు రూ.2.24 కోట్లు రానున్నాయి. విద్యా హక్కుచట్టం-2009 ప్రకారం.. బడులు లేని ఆవాసాలు, ఊళ్లల్లోని విద్యార్థులకు రవా ణా భత్యాన్ని విడుదల చేయాల్సి ఉం ది. ఆటోలు, వ్యాన్లలో రాకపోకలు సా గించే వారికి మేలు చూకూరనుంది. 1-5వ తరగతి వరకు ఒకటి, 8వ తరగతి వరకు మూడు, 9,10 తరగతులకు ఐదు కిలోమీటర్ల దూరంలోని స్కూళ్లలో చదువుకుంటే రవాణా భ త్యం అందజేస్తారు. గతేడాది విద్యార్థుల హాజరు శాతం 80 ఉండాలనేది కూడా మరో నిబంధన. ఆటోలు, వ్యా న్లలో స్కూల్కు వెళ్తున్న నిరుపేద వి ద్యార్థులకు మేలు చేకూరనుంది.
ఇక ప్రతి రోజూ ఆటోలో వెళ్తా
సారంగాపూర్, మార్చి 25 : నా పేరు రాహిత్య. మాది సారంగాపూర్ మండలంలోని జౌళి గ్రామం. స్వర్ణ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నా. మా ఇంటి నుంచి పాఠశాలకు రెండు కిలోమీటర్లు ఉంటుంది. నిత్యం నడుచుకుంట పాఠశాలకు వెళ్తున్నా. ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం అందించే రవాణా భత్యం ఇస్తుంది. ఇక ప్రతి రోజూ ఆటోలో స్కూల్కు వెళ్తా.
ఇక బాధలేదు
సారంగాపూర్, మార్చి 25 : నా పేరు సాహిత్య. మాది సారంగపూర్ మండలంలోని ధని గ్రామం. చించోలి-బీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నా. మా ఇంటి నుంచి పాఠశాలకు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంట్లో వాళ్లని డబ్బులు అడుక్కొని ప్రతిరోజూ ఆటోల్లో బడికి వెళ్తున్నా. పేద కుటుంబం కావడంతో డబ్బులకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఇంట్లో వాళ్లని బాధపెట్టాల్సిన అవసరముండదు. ప్రభుత్వం చెల్లించే రవాణా భత్యంతో ఎంచక్కా ఆటోల్లో స్కూల్కి పోయి వస్తా.
విద్యార్థులకు ఉపయోగకరం
సారంగాపూర్, మార్చి 25 : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు నిత్యం కృషి చేస్తోంది. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువు మధ్యలో ఆపేయకుండా సర్కారు తీసుకుంటున్న చర్యలు భేష్. రవాణా భత్యంతో పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. పేద విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు దూరం కానున్నాయి. నిర్మల్ జిల్లాలో 127 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 1193 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి రూ 71.58 లక్షలు రవాణా భత్యం కోసం ఖర్చు చేయనున్నది.
– రవీందర్ రెడ్డి, డీఈవో, నిర్మల్
ఆనందంగా ఉంది
సారంగాపూర్, మార్చి 25 : లింగాపూర్లోని స్వర్ణ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న. నిత్యం ప్రైవేట్ వాహనాల్లో ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తా. రవాణా ఖర్చులకు మస్తు ఇబ్బందవుతుంది. మేము తిప్పలు పడవద్దనే ప్రభుత్వం రవాణా భత్యం చెల్లిస్తుంది. ప్రతి నెలా రూ. 600 ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
– ఆర్ విక్రమ్, స్వర్ణ ఉన్నత పాఠశాల