మంచిర్యాలటౌన్, డిసెంబర్ 3: సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ శనివారం సాయంత్రం మంచిర్యాల జి ల్లా కేంద్రంలో టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు నిరసన చేపట్టారు. నల్లజెండాలను చేతబూని, బీజే పీ, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేంద్రం దిష్టిబొమ్మ ను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ది వాకర్రావు మాట్లాడుతూ బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీబీజీకేఎస్ నాయకులు ర వీందర్రెడ్డి, అన్నయ్య మాట్లాడుతూ బొగ్గుబ్లాకుల వేలాన్ని రద్దుచేయకుంటే సింగరేణిలో సమ్మె తప్పదని హెచ్చరించారు. మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, పీఏసీఎస్ చైర్మన్ సందెల వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకురాళ్లు మామిడిశెట్టి వసుంధర, అత్తి సరోజ, గరిగంటి సరోజ, సుధీర్, గట్టయ్య, కార్కూరి చంద్రమౌళి, మున్సిపల్ కౌన్సిలర్లు, టీబీజీకేఎస్ నాయకు డు లక్ష్మణ్, నస్పూర్ టీఆర్ఎస్ నాయకులు అక్కూ రి సుబ్బయ్య, బేర సత్యనారాయణ పాల్గొన్నారు.
బెల్లంపల్లి పట్టణంలో..
బెల్లంపల్లి, డిసెంబరు 3 : బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ మెంబర్ గెల్లి రాజలింగు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు.
మందమర్రిలో పట్టణంలో..
మందమర్రి డిసెంబర్ 3: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవాలని టీఆర్ఎస్(బీఆర్ఎస్), టీబీజీకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మందమర్రి పట్టణంలోని మార్కెట్ సమీపంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్), టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి కార్మికులు, ఈ ప్రాంత ప్రజలు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు జే.రవీందర్, ఓ.రాజశేఖర్, మద్దెల శంకర్, ఈశ్వర్, మద్ది శంకర్, భట్టు రాజ్కుమార్, శంకర్రావు, బిల్లా మాధవరెడ్డి, భిక్షపతి, గాలిపెల్లి తిరుపతి, రమణ, దాసరి శ్రీనివాస్, ఒడ్నాల రాజయ్య, భువనచం ద్ర, వికాస్, ముస్తఫా పాల్గొన్నారు.
గోదావరిఖనిలో..
గోదావరిఖని, డిసెంబర్ 3: బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం సాయంత్రం గోదావరిఖని చౌరస్తాలో టీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నరేంద్రమోదీ దిష్టిబొమ్మ ను దహనం చేశారు. రామగుండం మేయర్ డాక్టర్ బంగి అనిల్కుమార్, టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, టీబీజీకేఎస్ నాయకులు వడ్డేపల్లి శంకర్ మాట్లాడుతూ సింగరేణిని ప్రైవేట్పరం చేసి ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదన్నారు. కార్పొరేటర్లు కన్నూరి సతీశ్కుమార్, దాతు శ్రీనివాస్, కల్వచర్ల క్రిష్ణవేణి, నాయకులు తోడేటి శంకర్గౌడ్, జేవీ రాజు, మండ రమేశ్, ఆచ్చె వేణు, జావిద్పాషా, రఫీక్, తానిపర్తి గోపాల్రావు, చెరు కు బుచ్చిరెడ్డి, దీటి బాలరాజు, నారాయణదాస్ మారుతి, శేషగిరి, మేకల సమ్మయ్య, వెంకటేశ్, ఇనుముల సత్యం, చల్లగురుగుల మొగిలి, చెలుకలపల్లి శ్రీనివాస్, మెతుకు దేవరాజు, తోకల రమేశ్, నూతి తిరుపతి, నాయిని శంకర్, గుండు శ్రావణ్ పాల్గొన్నారు.
యైటింక్లయిన్ కాలనీలో..
యైటింక్లయిన్ కాలనీ, డిసెంబర్ 3: బొగ్గు బ్లా కుల నిరసనకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ దిష్టి బొ మ్మను స్థానిక యూనియన్ కార్యాలయం నుంచి ర్యాలీ తీశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద దహనం చేశారు. ఈ కార్యక్రమంలో చెరుకు ప్రభాకర్ రెడ్డి, బదావత్ శంకర్నాయక్, కొంగర రవీందర్, ఎట్టెం కృష్ణ, మల్లికార్జున్, సురేందర్, ధరణి మల్లేశ్వర్రావు, సదయ్య, శ్రీకాంత్, మేడి సదానందం, గౌస్పాషా,కూసం రమేశ్, గోశిక మోహన్ పాల్గొన్నారు.
కొత్తగూడెంలో..
భద్రాద్రి కొత్తగూడెం(నమస్తే తెలంగాణ)/కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 3 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి కార్మిక ప్రాంతాల్లో టీఆర్ఎస్ నాయకులు, సింగరేణి కార్మికులు మోదీ హటావో.. దేశ్కి బచావో అంటూ నినాదాలు చేశా రు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి ప్రధాన సెంటర్లలో దహనం చేశారు. కొత్తగూడెం జిల్లా కేంద్రం బస్టాండ్ సెంటర్లో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నాయకత్వంలో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు దామోదర్, ఎంఎ రజాక్, ఉర్దూ కమిటీ చైర్మ న్ అన్వర్పాషా, సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతురావు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, సంకుభావన అనుదీప్, మసూద్, వాసు, మాదా శ్రీరాములు, లావుడ్యా సత్యనారాయణ, కొట్టి వెం కటేశ్వర్లు పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టా రు. మణుగూరు పట్టణంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు నాయకత్వంలో టీఆర్ఎస్ నాయకు లు ముత్యం బాబు, అడపా అప్పారావు, టీబీజీకేఎస్ నాయకులు ఊకంటి ప్రభాకర్రావు, అబ్దుల్ రవూఫ్, వీరభద్రయ్య పాల్గొన్నారు. ఇల్లెందులో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ నాయకత్వంలో టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.
సత్తుపల్లిలో..
సత్తుపల్లి, డిసెంబర్ 3 : లాభాల బాటలో పయనిస్తున్న సింగరేణిని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తే సహించమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లిలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నుంచి రింగు సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ సింగరేణి గనులను ప్రైవేటుపరం చేస్తే బీజేపీ నాయకులకు తె లంగాణలో చోటుండదని హెచ్చరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమమహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆ త్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీ కూ సంపూడి రామారావు, టీఆర్ఎస్ నాయకులు షేక్ రఫీ, అంకంరాజు, వల్లభనేని పవన్ పాల్గొన్నారు.
టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో..
ఇల్లెందు రూరల్, డిసెంబర్ 3 : ఇల్లెందులోని ఏరియా జీఎం కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు ఎస్.రంగనాథ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ప్రభుత్వ రంగ సంస్థగా నడిచే సింగరేణిని దశలవారీగా ప్రైవేట్ వారికి అప్పగించే కుట్రలో భాగంగా ఈ నెల 26న బెంగళూరులో ఇన్వెస్టర్స్ కాన్ క్లేవ్ నిర్వహించి బొగ్గు బ్లాకులను ప్రైవేట్ కాంట్రాక్టర్కు కట్టబెట్టనుందన్నారు. ఈ కార్యక్రమంలోబ్రాంచ్ కార్యదర్శులు కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు, గౌస్మియా, సంజీవరావు, బొల, రాజు, యాదగిరి, మోయిన్భాష్, ఫిట్ సెక్రటరీలు హరిసింగ్, శ్రీనివాస్రెడ్డి, శ్రీకాంత్, ఆవుల శ్రీనివాస్, బాబూరావు, మాధవ్, సమర్జేశ్వర్రావు, రామారావు, యాకూబ్ఖాన్, ఆనంద్, లక్ష్మణ్, శంకర్, రాజ్కుమార్ పాల్గొన్నారు.
మణుగూరు ఏరియాలో..
మణుగూరు టౌన్, డిసెంబర్ 3 : మణుగూరు సింగరేణి ఏరియాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్ర ధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ పార్టీ మం డల, పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు, అడపా అ ప్పారావు, సొసైటీ అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వూకంటి ప్రభాకరరావు, తాళ్లపల్లి యాదగిరి, గుర్రం సృజన్, బండ్ల సురేశ్, కత్తి రాము, రామసాని రామిరెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు రవూఫ్, వీరభద్రయ్య, కాపా శివాజీ, వర్మ, వెంకటేశ్వరరెడ్డి, బానోతు కృష్ణ, పిట్ సెక్రెటరీలు, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.