తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేండ్లు నిండిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభమై 22వ తేదీ వరకు కొనసాగను న్నాయి. 21 రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లను విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించింది.
ఏర్పాట్లను ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు పరిశీలించారు. నిర్మల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మంచిర్యాలలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, కుమ్రం భీం ఆసిఫాబాద్లో ప్రభుత్వ విప్ అరికేపుడి గాంధీ, ఆదిలాబాద్లో గంప గోవర్ధన్ జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. అనంతరం సేవా పురస్కారాలు అందించనున్నారు. – ఎదులాపురం/నిర్మల్ టౌన్, జూన్ 1