బాసర, ఫిబ్రవరి 4 : వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆలయ వైదిక బృంద ఆధ్వర్యంలో అమ్మవార్లకు అభిషేకం, స్థాపిత దేవతాపూజలు, రుద్రహోమం, మూలమంత్ర హోమంతో పాటు పలు పూజలు చేశారు. శనివారం వసంత పంచమి సందర్భంగా సరస్వతీ అమ్మవారికి ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఐకేరెడ్డి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. వసంత పంచమి సందర్భంగా అమ్మవారి సన్నిధిలో భక్తులు తమ చిన్నారులకు అక్షర శ్రీకారం చేయించడానికి పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. దీని కోసం ఆలయాధికారులు ఏర్పా ట్లు చేశారు. ప్రత్యేకంగా క్యూలైన్లు, అక్షరాభ్యాస టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని అధికారులు భక్తులకు సూచిస్తున్నారు. సీఐ వినోద్రెడ్డి, బాసర ఎస్ఐ మహేశ్ దాదాపు 3 వందల మందితో బందోబస్తు నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.