మామడ, సెప్టెంబర్ 17 : పార్వతీపారమేశ్వరుల ప్రాణ పుత్రుడు.. గణనాథుడు నేడు కొలువుదీరనున్నాడు. ఉండ్రలయ్యాకు దండాలు పె డుతూ నిత్య పూజలు అందించేందుకు భక్తులు సమాయత్తమయ్యారు. విఘ్నాలు తొలగించు వి నాయక.. అంటూ మండపాల్లో వెలసిన దేవదేవుడికి విన్నవించే రోజు ప్రారంభం కానున్నది. ఏ కార్యం తలపెట్టినా ఆది పూజలు అందేది వి నాయకుడికే. ఏ వ్రతం చేపట్టినా గణపతి స్తో త్రంతోనే పూజలు ప్రారంభించడం అనవాయి తీ. మండపాల్లో కొలువుదీరనున్న వినాయకుడు 21 పత్రులతో పూజలు అందుకోనున్నాడు.
ఎన్నో గుణాల పత్రి..
చవితి సందర్భంగా భక్తులు వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆ దేవదేవుడి పూజల్లో ప్రధానమైనది పత్రి. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిత్యం 21 రకల పత్రులతో పూజించి, మొక్కులు చెల్లించుకుంటారు. అనాదిగా వస్తున్న ఈ ఆచారంలో ఎన్నో ఆరోగ్య విషయాలు దాగున్నాయి.
పూజకు ఉపయోగించే పత్రులు..