మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 22 : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న తొలిమెట్టు, ఉన్నతి, లక్ష కార్యక్రమాలను విజయవంతం చేయడంలో మానిటరింగ్ అధికారులైన ఎంఈవోలు, మండల నోడల్, క్లస్టర్ నోడల్ అధికారులదే కీలక పాత్ర అని మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య అన్నారు. జిల్లా సైన్స్ కేంద్రంలో శుక్రవారం రూమ్ టూ రీడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్లస్టర్, మండల నోడల్ అధికారులు, ఎంఈవోలతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మానిటరింగ్ అధికారులు పాఠశాలల సందర్శనకు, తరగతి గదుల్లోకి వెళ్లినప్పుడు సూక్ష్మ స్థాయిలో పరిశీలన చేయాలని సూచించారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే సంబంధిత ఉపాధ్యాయులు, హెచ్ఎంలకు సూచనలివ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు చౌదరి, శ్రీనివాస్, యశోదర, సత్యనారాయణ మూర్తి, రాజ్ కుమార్, సైన్స్ అధికారి మధుబాబు, రూమ్ టూ రీడ్ ఇండియా రాష్ట్ర కో ఆర్డినేటర్ ప్రవీణ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ నితీన్, జిల్లా హెడ్ మధు, రిసోర్స్ పర్సన్లు, వివిధ మండ లాల ఎంఈవోలు, నోడల్ అధికారులు, హెచ్ఎంలు తదితరులు పాల్గొన్నారు.