‘కాంగ్రెస్ ‘కాలం’ వస్తే.. ధరణి రద్దయితది. డిజిటల్ రికార్డులు మాయమై రాత పుస్తకాలు ప్రత్యక్షమైతయ్. 31 కాలమ్స్ వస్తయ్. మళ్లా పటేల్, పట్వారీ వ్వవస్థ వస్తది. ఎవరు లంచమిస్తే వారి పేరుమీద భూములు ప ట్టాలైతయ్. రాత్రికి రాత్రే కౌలుదారు భూ యజమానిగా మారుతడు. ఈ విషయం భూ యజమానికి తెలియకుండానే జరిగిపోతది. ఇగ, కొట్లా టలు, గొడవలు మొదలై పల్లెలు రక్తపాతమవుతయ్. పైరవీకారులు పుట్టు కొస్తరు. పొలం పనులు వదిలి పెట్టి ఆఫీసులు, దళారుల చుట్టూ తిరగడానికే సరిపోతది. పదేండ్లు వెనక్కి వెళ్తం.’ అని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చే స్తున్నరు. కాంగ్రెసోళ్లు ధరణిని రద్దు చేస్తే మేం వారి భరతం పడుతా మని, బుద్ధి చెప్పి తీరుతామని శపథం చేస్తున్నరు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితోనే భూములకు రక్షణ ఉందని హ్యాపీగా తెలుపుతున్నరు.
– ఆదిలాబాద్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ)
తాంసి, నవంబర్ 22 : నా పేరిట ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. మా తండ్రి నుంచి వచ్చిన భూమి కావడంతో నా పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. అప్పటికీ ధరణి లేదు. నా పేరిట పట్టా కావడానికి యేడాది పాటు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగిన. పట్వారీ దగ్గరికి పోతే ఎమ్మార్వో దగ్గరకు అని తిప్పుకున్నరు. చివరకు చేతులు తడిపితేనే నాపేరిట భూమి పట్టా అయింది. ధరణి వచ్చిన తర్వాత మా ఏరియాలోని వాళ్లు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాం రమ్మంటే వెళ్లా. అరగంటలోనే రిజిస్ట్రేషన్ అయిపోయింది. నేను ఆశ్చర్యానికి గురయ్యా.
– ముత్యాల దేవమ్మ, మహిళా రైతు, ఖోడద్
ఆదిలాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : పటేల్, పట్వారీ వ్యవస్థ, ఆ తర్వాత వచ్చిన రెవెన్యూ వ్యవస్థ.. ఏదైనా సరే రైతులను ఏడిపించినయ్. అధికారులు రాత్రికి రాత్రి పట్టాదారుల పేర్లు మార్చి రైతుల బతుకులను ఆగం చేసేటోళ్లు. రాత పద్ధతిలో ఉన్న రికార్డుల్లో, పహణీల్లో ఇష్టం వచ్చినట్లు మార్పులు-చేర్పులు చేసేటోళ్లు. ఆయన పెన్ను పట్టి రాసిందే భూమి. గీసెందే హద్దు. రైతులకు తమ పేరు మీద ఉన్న భూమి వేరేటోళ్ల పేరిట మారిందన్న విషయం కూడా తెలియదు. అక్కరకో, ఆడబిడ్డ పెండ్లికో, కొడుకు చదువుకో భూమి అమ్ముకుందమని చూసే సరికి వాళ్ల పేరిట భూమి ఉండేది కాదు. అప్పుడు మొదలయ్యేది అసలు కథ.. ఎవుసం పక్కన పెట్టి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, వీఆర్వోల చుట్టూ తిరుగుడుకే సరిపోయేది. భూమి కోసం పైరవీలు కొట్లాటలు, గొడవలు, పోలీస్స్టేషన్లో పంచాయితీలు.. ఇవేవి తెగకపోతే కోర్టు దాకా పోక తప్పేది కాదు. కోర్టుకు పోయిన ముచ్చట ఎంతకూ తెగక అరిగోస పడాల్సి వచ్చేది.
గప్పట్ల ఈ పంచాయితీలన్నీ పహాణీలో ఉన్న 31 కాలమ్స్తో మొదలయ్యేది. ముందుగా పహాణీలో ఉన్న అనుభవదారుకాలంలో భూమి యాజమానిగా ఉన్న రైతు కాకుండా మరొకరి(కబ్జా దారు) పేరు ఎక్కించేటోళ్లు. అది జరిగిన ఏడాదిలోపూ రైతు పహాణీ చెక్ చేసుకోలేదా.. వచ్చే ఏడాదికి అనుభవదారు పట్టాదారు అయ్యేటోడు. అసలు పట్టాదారు రోడ్డున పడేటోడు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ గీ పనే చేస్తనని చెప్పుకొని ఓట్లు అడుగుతున్నది. అనుభవదారు (కౌలు)దారు కాలమ్ తీసుకువచ్చి రైతులను మళ్లోసారి మోసం చేయాలని చూస్తున్నది. భూమిని అమ్ముకోవాలన్నా, కొనాలన్నా.. రైతు వచ్చి వేలిముద్ర పెడితే గానీ సాధ్యం గానీ డిజిటల్ వ్యవస్థ ధరణిని రద్దు చేస్తామంటున్నది.
ధరణిని తీసేసి మళ్లీ రాత పుస్తకాలు తెచ్చి, వీఆవ్వోలను పెట్టి, కౌలుదారు కాలమ్ తీసుకొచ్చి.. లంచం ఇస్తే చాలు హక్కుదారుల పేర్లను మార్చే వ్యవస్థను తీసుకురావాలని కుట్రలు పన్నుతున్నది. పదేళ్ల కిందట తెలంగాణలో ఎలాంటి పరిస్థితి ఉండెనో.. అదే మళ్ల తీసుకురావాలని చూస్తున్న కాంగ్రెస్కు పొరపాటున అవకాశం ఇచ్చినా.. తమను నట్టేట ముంచుడు ఖాయమని రైతులు భయపడిపోతున్నరు. మా తలరాతలు మార్చే హక్కు ఇంకొకడికి ఎందుకియ్యాలే.. పైరవీలు, కొట్లాటలు, గొడవలు మాకెందుకు.. ఇవన్నీ తీసుకొచ్చే కాంగ్రెస్ కాలం వొద్దే వద్దు అని తెగేసి చెప్తున్నరు. ధరణి తీసేస్తామంటున్న మోసకారి కాంగ్రెస్పై రైతుల అభిప్రాయాలు..
నేరడిగొండ, నవంబర్ 22 : కౌలుదారుల చట్టం తెస్తే ఇగ ఊళ్లళ్లో మళ్లీ గొడవలైతయ్. ధరణిని తీసేసి, భూమాత పోర్టల్ను తెస్తమని కాంగ్రెసోళ్లు అంటున్నరు. కౌలు, అనుభవదారులు కాలమ్స్ పెడితే మళ్లీ నాదంటే నాదని లొల్లులు షురూ అయితయ్. వేరే పనుల మీద పట్నాల్లో ఉండే భూ యజమానులకు ఇది ఎంతో ఇబ్బందయితది. ఇగ కౌలు చేసుకునేటోళ్లు భూమి నాదే అంటే మొదటికే మోసం వస్తది. కాంగ్రెసోళ్ల పనే గిది. ఊళ్లల్ల పుల్లలు పెట్టే పని మొదలు పెడుతున్నరు. ధరణి పోర్టలే మంచిగున్నది. గదే ఉండాలె. గిట్ల దళారులకు మంచి జేసే పార్టీలను రాష్ట్రం నుంచి ఎల్లగొట్టాలె. అందుకే మళ్లీ కేసీఆర్ సారే రావాలె. కాంగ్రెస్ పార్టీ ధరణిని తీసేస్తే భూములు మళ్లి తారుమారు అవుతాయి. ధరణి ఉండాలంటే తప్పకుండా కాంగ్రెస్కు అవకాశం ఇవ్వద్దు.
– జాదవ్ నారాయణ, వాగ్ధారి
ఇంద్రవెల్లి, నవంబర్22: కాంగ్రె సోళ్లు వస్తే ధరణిని బంగాళాఖాతం లో కలుపుతమంటున్నరు. రైతులకైతే ధరణి ఉండాలె. అంటే కాంగ్రెస్సే పో వాలె. ఎట్లా అదే పని అయితది. పా త పద్ధతి తెస్తే మేం మళ్లీ ఆఫీసుల చు ట్టూ తిరగాలె. వాళ్లు ఏసీల కూర్చొని మేం ఇబ్బందులు పడుతుంటే, ము చ్చట్లు పెట్టుకుంటరు. ప్రజలు ఇబ్బం ది పడొద్దనే సీఎం కేసీఆర్ ధరణి పో ర్టల్ తెచ్చిన్రు. గిప్పుడు మీ సేవ సెంటర్కి పోతే సరిపోద్ది. వాళ్లే అని చూసి చెబుతున్నరు. గింత మంచిగ పనైతంటే ధరణిని తీసేస్తం.. లేపేస్తం అని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నరు. గిట్లయితే వీళ్లేం దుకు మాకు. మంచి చేసేటోళ్లు కావాలె గని, ముంచెటోళ్లెందుకు..? సీఎం కేసీఆర్ చేసినట్లు చేసుడు వీళ్లకు చేతకాదు. అధికారం మీద కాదు.. ప్రజల మీద కొంచమన్నా ప్రేముండాలె. మంచి పనులు చేస్తమని చెప్పాలె. ధరణిని తీసేస్తమనుడు మాత్రం మంచిది గాదు.
– కోవ లాల్షావ్, రైతు, చిత్తబట్ట.
ఇచ్చోడ, నవంబర్ 22: కాంగ్రెసోళ్లు ధరణి పోర్టల్ను తీసేసి రైతులను దోచుకుందమని చూస్తున్నరు. కొత్త పోర్టల్ వస్తే రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. పటేల్, పట్వారీ వ్యవస్థతో భూములు తారమారయ్యే అవకాశం ఉంటది. గప్పుడు లాంచాలివ్వకపోతే అధికారులు పనిచేయరు. ఒకరి పేరు మీద ఉన్న భూమిని మరొకరి పేరుపై రాసేసుకుంటరు. గిట్లాంటి దుర్మార్గాలు ఉంటయనే ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చిన్రు. రైతుబంధు, రైతు బీమా కల్పిస్తున్నరు.కాంగ్రెసోళ్లు ఇది తీసేస్తం.. కరెంటియ్యం.. బతకనియ్యం అంటున్నరు. వీళ్లు అధికారంలోకి వస్తమని కలలు కంటున్నరు. వీళ్లు తలకిందుల తపస్సు చేసినా మళ్లా వచ్చేది కేసీఆర్ సర్కారే.
– సోనేరావు, రైతు,దుబార్పేట్
రైతులను ఆగం చేసేందు కు చూస్తున్న చేతి పార్టోళ్ల కథ ఇక ఒడిశింది. ధరణిని బం గాళాఖాతంలో కలుపుతమ ని మళ్లోసారి వీళ్ల బుద్ధి బయ ట పెట్టుకున్నరు. ధరణి వచ్చి నంకనే ఆఫీసుల్లా పనులు సక్కగవుతున్నయ్. వీఆర్వోలు, పట్వారీల ఇండ్ల పొంటి, ఆఫీసుల సుట్టూ తిరి గే పని తప్పింది. ధరణి ఉంటనే భూములకు రక్షణ ఉంట ది. మళ్లీ పాత పద్ధతి తెస్తే లంచాలు పెరుగుతయ్. మళ్లీ రైతులకు కష్టాలు కొనితెచ్చుకున్నట్లు అయితది. కాంగ్రెసోళ్ల ఆలోచనలు దళారులకు మంచి చేసేటట్లు ఉంటయ్. రైతులు వీళ్లకు ఏం అన్యాయం జేసిన్రు. అందుకే రైతులెవ్వరూ గీ కాంగ్రెసోళ్ల వైపు చూడరు. మళ్లా కేసీఆర్నే సీఎం జేసుకోవాలని చూస్తున్నరు.
– భైరి లక్ష్మణ్, పీచర
ఉట్నూర్, నవంబర్ 22 :తెలంగాణ వచ్చినంకనే పంట భూములకు మంచి రోజులు వచ్చినయ్, రైతుల కోసం కేసీఆర్ సారు ఎంతో చేస్తున్నరు. కాంగ్రెసోళ్లది గతంలో దళారుల రాజ్యమే. మళ్లీ ఆ రాజ్యమే తేవాల్నని వాళ్లు చూస్తున్నరు. వాళ్ల మా టలు కూడా గట్లనే ఉన్నయ్. మూడు గంటల కరెంట్ ఇస్తే రైతులు ఎవుసం చేసుడు బంద్ చేస్తరు. ఇగ వాళ్లు చెప్పిందే మొదలైతది. ధరణి పోర్టల్ తోనే పనులన్నీ మంచిగై తున్నయ్. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పనులయితున్నయని అందరూ చెబుతున్నరు. గిసోంటి పథకాలను తీసేసుడు కరెక్టు కాదు. కాంగ్రెసోళ్లు మంచి పను లు చెయ్యరు.. చేసేటోళ్లను చెయ్యనియ్యరు.
– చిన్నుబాయి, దంతన్పల్లి
భీంపూర్, నవంబర్ 22 : గతంలో పట్వారీ వ్యవస్థ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డం. మళ్లీ కాంగ్రెస్ వస్తే పట్వారీ వ్యవస్థను తెస్తమంటున్నది. గిప్పుడున్న ధరణి పోర్టలే మంచిగున్నది. వీళ్లు వస్తే మళ్లీ భూముల కొట్లాటలు పెట్టేటట్లు ఉన్నరు. గతంలో ఈ ప్రభుత్వాలు రైతుల కష్టాలను పట్టించుకోలేదు. ఎన్నో ఇబ్బందులు పడ్డం. ఇప్పుడిప్పుడే మంచి జరుగుతుంటే, వాళ్లు ఒర్వలేకపోతున్నరు. అయినా వాళ్లు అధికారంలోకి వస్తమని కలలు కంటున్నరు. కాంగ్రెస్కు తెలంగాణలో అస్సలు చోటే లేదు. వాళ్లను ఎవ్వలూ పట్టించుకోరు. ఇప్పుడంతా కేసీఆర్ జమానే నడుస్తున్నది. ఆయనైతనే ప్రజలకు, రైతులకు మంచి జరుగుతది.
– నర్సింగ్రావు, రైతు, గడ్చాంద.
బజార్హత్నూర్, నవంబర్ 22 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కా గితాలపై రాసిన పేర్లను వై ట్నర్లతో తొలగించి పేర్లు మార్చిన సందర్భాలు ఉన్నా యి. ఇప్పుడు మళ్లీ అదే కాం గ్రెస్ పార్టీ వారిని గెలిపిస్తే రెవెన్యూ వ్యవస్థలో పాత పద్ధతులు తెస్తామంటున్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థ మళ్లీ వస్తే రైతులకు గోస మొదలైనట్లే. పట్టాదారు స్థానంలో అ నుభవదారు, మాన్యందారు కాలమ్లు పెట్టడంతో నిజమైన పట్టాదారుడికి తిప్పలు తప్పవు. పటేల్, పట్వారీ వ్యవస్థతో తిరిగి లంచగొండి, దోపిడీ వ్యవస్థ వస్తుంది. కాంగ్రెస్ గెలిచే ది లేదు..సచ్చేది లేదు. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీని తరిమి కొడితేనే రాష్ట్రం బాగుపడుతుంది. ధరణితో ఎలాంటి కష్టాలు లేవు. కావున మళ్లీ కేసీఆర్ సర్కారే రావాలి.
– చట్ల వినిల్, రైతు,బజార్హత్నూర్