నార్నూర్, ఫిబ్రవరి 12 : ఏజెన్సీలో సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేస్తున్న చిరుధాన్యాలకు మంచి గిరాకీ ఉంది. గిరిజనులు కొండలు, గుట్టలను చదును చేసి వాటిలో జొన్నలు, సజ్జలు, సామలు, రాగి, కందులు, బొబ్బర్లు, మినుము, పెసర, గో ధుమ, శనగ వంటి పంటలను సాగు చేస్తుంటారు. అయితే ఈ పంటలను వారు విక్రయించరు. ఏడాది పాటు కుటుంబ సభ్యులందరూ తినేందుకే వీటిని పండిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయ వ్యవసాయం. నేటి ఆధునిక యుగంలోనూ నార్నూర్, గాదిగూడ గిరిజనులు జొన్న లు, సామలు, సజ్జలు, కొర్రలు వంటి వాటి లో పప్పు వేసుకొని ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ఉమ్మడి మండలంలో 18 వేల ఎకరాల్లో జొన్న ..
ఉమ్మడి మండలంలోని గిరిజన ప్రాంతంలో ఈ ఏడాది వానకాలం, యాసంగి సీజన్లో సుమారు 18 వేల ఎకరాల్లో గిరిజనులు జొన్న పంటను సాగు చేస్తున్నారు. వర్షాధారం, యాసంగిలో చెరువులు, బావులు, బోర్బావుల నీటితో వీటిని పండిస్తున్నారు. రసాయన ఎరువులు వాడకుండా కేవలం పశువుల పేడను మాత్రమే వేసి పండిస్తున్నారు. వర్షాధార పంటల సాగు వల్ల ఖర్చు తక్కు వ ఆవుతుందని జొన్న అన్నం వల్ల ఎంతో ఆరోగ్యమని గిరిజనులు చెబుతున్నారు.
ఈ పంటకు చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉండదని అయితే అటవీ ప్రాంతంలో పిట్టలు, ఇతర వన్యప్రాణల వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉం టాయని చెబుతున్నారు. అలాగే అంతర పంటలుగా సుమారు 1500 ఎకరాల్లో కంది, 800 ఎకరాల్లో పెసర, మినుము, బొజ్జర్లు, సామలు, కొర్రలు, సజ్జలు,900ఎకరాల్లో శనగ, 200 ఎకరాల్లో గోధుమ ,150 ఎకరాల్లో వేరుశనగ, 100 ఎకరాల్లో మక్కజొన్న వంటి పంటలను పండిస్తుంటారు. రానున్న రోజుల్లో జొన్న, కంది, సామలు, కొర్రలు, సజ్జలు వంటి గిరిజన సంప్రదాయ పంటలను మరింత సాగు చేసేలా వ్యవసాయ అధికారులు వారికి అవగాహన కల్పిస్తున్నారు.
జొన్న అన్నంతో ఆరోగ్యం..
జొన్నతో చేసిన ఆహా ర పదార్థాలు ఎం తో ఆరోగ్యకరం. మా తాతల నుం చి ఇప్పటివరకూ మేము జొన్న అన్న మే తింటున్నాం. ఈ ఏ డాది ఎకరంన్నర భూమిలో జొన్న పం ట వేసిన. రసాయన ఎరువులు లేకుండా పడిస్తున్నాం . వచ్చిన జొన్నలను మా కుటుం బ సభ్యులందరం తింటాం.
-పెందోర్ భీంరావ్(చొర్గావ్,రైతు)
వర్షాధారంగా పండిస్తాం..
అడవిని పోడుగా చేసి కొండ ప్రాంతంలో జొ న్నలు, సజ్జలు, చిరుధాన్యాలు పండిస్తున్నాం. ఇవే మా జీవనాధారం. నాగలికట్టం, వర్షాధారంగా మాత్రమే పంటలను పండిస్తాం. వరి ఇత ర పంటల ఆహార పదార్థాలు తినే అలవాటు లేదు. అడవిలో మేం పండించిన పంట అంటేనే మాకు ఇష్టం, మా తాతలు, తండ్రులు తిన్న తిండే మేం తింటున్నాం.
-చిక్రం భీంరావ్ (గంగాపూర్, రైతు)
ప్రోత్సహిస్తున్నాం..
ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాలతో గిరిజనులు సంప్రదా య పంటలను పం డించేలా ప్రోత్సహిస్తు న్నాం. ఈ ఏడాది మండ లంలో జొన్న, కంది వంటి పంటలు పెద్ద మొత్తంలో సాగు చేశారు. సేంద్రియ ఎరువులే వాడుతారు. రానున్న రోజుల్లో చిరుధాన్యాల పంటల సాగు మరింత పెరిగేలా అవగాహన కల్పిస్తాం.
-గిత్తే రమేశ్ (వ్యవసాయ అధికారి,నార్నూర్)