మంచిర్యాల ఏసీసీ, మే 5 : హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో వైద్య కళాశాల నిర్మాణానికి రాష్ట్ర వైద్యశాఖ నుంచి (సోమవారం) అనుమతులు రావడంతో పాటు మంచిర్యాలలోని మార్కెట్ యార్డు ఆవరణంలో 380 పడకల దవాఖాన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ మొదలు కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ మేరకు శుక్రవారం పట్టణంలోని ప్రస్తుత మెడికల్ కళాశాల ఆవరణలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు సంబురాలు నిర్వహించారు.
మిఠాయిలు పంచి.. పటాకులు కాల్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మెడికల్ కళాశాల శాశ్వత నిర్మాణం కోసం అనుమతులు వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేశ్నేతకాని, ఎమ్మెల్సీ దండె విఠల్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.