ఉట్నూర్ రూరల్, జనవరి 2 : క్రీడా పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించేలా ఉన్నతంగా ఎదగాలని జిల్లా క్రీడల అధికారి పార్థసారథి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాలలో కమిషనర్ గిరిజన సంక్షేమ శాఖ హైదరాబాద్ ద్వారా అందించిన స్కౌట్ అండ్ గైడ్స్ దుస్తులను 32 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నందున ఉన్నతంగా ఎదగాలని సూచించారు.
కార్యక్రమంలో స్కౌట్ అండ్ గైడ్ జిల్లా ఇన్చార్జి అధికారి యాధవరావ్, ఏటీడీవో క్రాంతి, ప్రధానోపాధ్యాయుడు ఉత్తమ్, వ్యాయామ ఉపాధ్యాయుడు హేమంత్, కాశీరాం, మనోహర్, రాంచంద్రం, ఉపాధ్యాయులు బలరాం, ప్రభాకర్, మాధవరావు, నాగోరావ్, సురేశ్, ఆనంద్రావు, మనోజ్కుమార్, గంగారాం, శ్యాంరావ్, మహేందర్ పాల్గొన్నారు.