లక్షెట్టిపేట, ఏప్రిల్ 17 : ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచాలని, రైతులు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోళ్లు చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. లక్ష్మీపూర్ గ్రామంతోపాటు మరికొన్ని గ్రామల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని, కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలన్నారు. ఆయన వెంట డీఆర్డీవో కిషన్, డీపీఎంలు వేణుగోపాల్, స్వర్ణలత, సంజీవ్, రమేశ్, ఐకేపీ ఏపీఎం విజయలక్ష్మీ ఉన్నారు.
జన్నారం, ఏప్రిల్ 17 : రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ సూచించారు. బుధవారం పొనకల్, బాదపెల్లి, రేండ్లగూడ, తపాలాపూర్ గ్రామాల్లోని కోనుగోలు కేం ద్రాలను పరిశీలించారు. కార్యక్రమం సీవో కావటి రాజన్న, ఏవో సంగీత, ఏఈవోలు అక్రముల్ల, త్రిసంధ్య పాల్గొన్నారు.