బాసర, అక్టోబర్ 15 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో శరన్నవరాత్రులు ఆదివారం వైభవంగా ప్రారంభమైయ్యాయి. తొలి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం అమ్మవారికి అభిషేకం అనంతరం ఘట స్థాపనతో అమ్మవారిని ప్రతిష్టించి ఉత్సవాలను ప్రారంభించారు. ఉదయం 4 గంటలకు అర్చకులు, వేద పండితులు అమ్మవారికి అభిషేకం నిర్వహించిన అనంతరం, ఆలయ చైర్మన్ శరత్పాఠక్ దంపతులు, ఈవో విజయరామరావు కలశ స్థాపన పూజ చేసిన అనంతరం ఘట స్థాపన పూజలు నిర్వహించారు. ఆదివారం ఆలయంలో గణపతి, కలశ పూజ, తదితర వాటిని చేపట్టారు. అనంతరం భక్తు లు అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు చి న్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ముథోల్ సీఐ వినోద్రెడ్డి, బాసర ఎస్ఐ గణేశ్ బందోబస్తును పరిశీలించారు.
సరస్వతి అమ్మవారు రెండో రోజు సోమవారం బ్రహ్మచారిణి అవతారంలో ఇవ్వనున్నారు. అమ్మవారికి నైవేద్యంగా పులిహోరను సమర్పించనున్నారు.