మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 30: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2024-25 విద్యా సం వత్సరానికి ఐదు నుంచి పదో తరగతి వరకు గురుకులాల్లో ప్రవేశానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగం గా ఐదో తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నె ల 18వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వచ్చే నెల ఆరో తేదీతో ముగియనుంది. ఫిబ్రవరి 11వ తేదీన ఉద యం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
మంచిర్యాల జిల్లాలో తొమ్మిది తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు ఉన్నాయి. మంచిర్యాల, జైపూర్, కోటపల్లి, బెల్లంపల్లి, కాసిపేట మండలాల్లో బాలుర, బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూర్, లక్షెట్టిపేటలలో బాలికల గురుకులాలున్నాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో బాలుర, బోథ్, ఆదిలాబాద్లలో బాలికల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ), కాగజ్నగర్, రెబ్బెనలలో బాలికల, ఆసిఫాబాద్, సిర్పూర్(టీ)లలో బాలుర విద్యాలయాలున్నాయి.
ఒక్కో గురుకులంలో 80 సీట్ల చొప్పున 17 గురుకులాల్లో 1,360 సీట్లు ఉన్నాయి. ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుంది. ఒక్కో గురుకులంలో ఎస్సీలకు 65 సీట్లు, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలకు 15 సీట్ల చొప్పున కేటాయించారు. ఒక్కసారి అడ్మిషన్ పొందితే పదో తరగతి వరకు హాస్టల్ వసతితో కూడిన బోధన ఉంటుంది. బట్టలు, పుస్తకాలు, కాస్మొటిక్ చార్జీలతో పాటు అన్ని వసతులు కల్పించనున్నారు. ఒక ఫోన్ నంబర్తో ఒక దరఖాస్తు మాత్రమే చేసుకోవాలి. ఇతరుల ఫొటోలు పెట్టి దరఖాస్తు చేస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
గురుకులాల్లో చేరేందుకు 2023-24 విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి చదు వుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. నాలుగో తరగతి చదువుతున్నట్లుగా ధ్రువీక రణ పత్రాన్ని తప్పకుండా దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాత జిల్లా(ఆదిలాబాద్)ను ఒక యూనిట్గా తీసుకొని ఎంపిక చేస్తాం. ఆసక్తి గల విద్యార్థులు జనవరి ఆరో తేదీలోగా రూ.100 చెల్లించి వెబ్సైట్(http: //tswreis. ac.in, http://tgtwgurukulam. telangana. gov.in, http://tgcet. cgg.gov.in) లేదా http://mjptbcwreis. telangana. gov.in లో దరఖా స్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం హెల్ప్లైన్ 1800 425 45678లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చు.
-కొప్పుల స్వరూపారాణి, ఆర్సీవో, టీఎస్డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ, ఆదిలాబాద్