తాండూర్, జూలై 28 : భూముల సర్వే, రీ సర్వే ప్రక్రియతో భూ సమస్యల పరిషారం సులభతరం కావడంతో పాటు భవిష్యత్లో భూ వివాదాలకు అడ్డుకట్ట పడుతుందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. తాండూర్ మండలంలోని ద్వారకాపూర్ గ్రామ పంచాయతీలో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, తహసీల్దార్ జ్యోత్స్న, ల్యాండ్ సర్వే ఏడీ శ్రీనివాస్తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పట్టా, మోకా, వివరాలను పరిశీలించి ప్రభుత్వ నిబంధనల మేరకు హద్దులు ఖరారు చేస్తామని, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రీ సర్వే అనంతరం అర్హుల పేరిట, భూ రికార్డులు సిద్ధమవుతాయని, డిజిటల్ మ్యాపింగ్తో భవిష్యత్లో భూ వివాదాలకు అడ్డుకట్టపడుతుందని పేర్కొన్నారు.
గ్రామంలో దాదాపు 90 శాతం భూములకు శాశ్వత పరిషారం జరిగిందని, మిగిలిన భూమి న్యాయస్థానంలో కొనసాగుతున్న వివాదాల తీర్పు అనంతరం పరిషారం అవుతుందని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్, మండల ప్రత్యేకాధికారి అంజయ్య, తహసీల్దార్, ఎంపీడీవో శ్రీనివాస్, వ్యవసాయాధికారి సుష్మతో కలిసి రాయితీ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.