నాడు
రాష్ట్రం ఏర్పడక ముందు(2011-12) తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి గుంతలమయంగా ఉండి, వర్షం పడితే చెరువును తలపించేది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి జైనథ్ మండలం మీదుగా బేల మండలం వెళ్లడానికి(దాదాపు 35 కిలోమీటర్లు) 2.30 గంటల సమయం పట్టేది. కల్వర్టులు, బ్రిడ్జిలు లేకపోవడంతో మోకాలు లోతు నీటి నుంచి వెళ్తూ పాదచారులు, వాహనదారులు ప్రత్యక్ష నరకం అనుభవించేవారు. ఈ అంతర్రాష్ట్ర రోడ్డుపై మొరాయించే వాహనాలు దర్శనమిచ్చేవి.
నేడు
స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత(2014-15) ఈ అంతర్రాష్ట రహదారిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. రూ.71 కోట్లు మంజూరు చేశారు. 2016-17 సంవత్సరంలో అంతర్రాష్ట్ర రోడ్డు, ఎనిమిది బ్రిడ్జిలు, 30 కల్వర్టు నిర్మాణాలు పూర్తి చేశారు. ప్రస్తుతం అద్దంలా మెరిసే తారు రోడ్డుపై మహారాష్ట్రలోని చంద్రాపూర్, బల్లార్షకు అనుసంధానం కావడంతో రోజూ 2 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికులు సులువుగా ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీ అరగంటకు ఒక బస్సు నడుపుతున్నది. ఇది ఆర్టీసీకి ఆదాయం ఇచ్చే రూట్గా మారింది.
– ఎదులాపురం, మే 7