ఆసిఫాబాద్ టౌన్,మార్చి13: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ముగిశాయి. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్ తెలిపిన వివరాల ప్రకారం ఆఖరి రోజు 5324 మందికి గాను, 5046 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. 278 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. గురువారంతో ద్వితీయ సంవత్సరం పరీక్షలు కూడా ముగుస్తాయని వివరించారు.
మంచిర్యాల అర్బన్, మార్చి 13: ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారంతో ముగిశాయి. జిల్లాలోని 25 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు డీఐఈవో శైలజ తెలిపారు. పరీక్షలకు 93.17 శాతం విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. మొత్తం 7,115 మందికి గాను 6,629 మంది పరీక్ష రాశారని, 486 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు చెప్పారు.