మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 12 : ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితా లు ఆదివారం విడుదలయ్యాయి. సెకండియర్ ఇంటర్ జనరల్ కేటగిరీ ఫలితాల్లో 71.63 శాతం ఉత్తీర్ణత సాధించి మంచిర్యాల జిల్లా 19వ స్థానంలో నిలిచింది. వొకేషనల్ సెకండియర్ ఫలితాల్లో 76.66 శాతం ఉత్తీర్ణత సాధించి 10వ స్థానంలో నిలిచింది. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో జనరల్ కేటగిరీలో 60.31 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లా 21వ స్థానంలో నిలవగా, వొకేషనల్లో 57.55 శాతం ఉత్తీర్ణత సాధించి 23వ స్థానంలో నిలిచింది. కాగా, 2026 ఇంటర్ ఫలితాల్లో బాలికలు సత్తాచాటారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు జనరల్ కేటగిరీలో ఈ ఏడాది మొత్తం 4741 మంది పరీక్షలు రాయగా, అందులో 3396 మంది ఉత్తీర్ణత సా ధించారు. అందులో 2137 మంది బాలురు పరీక్షలు రాయగా, 1341 (62.75 శాతం)మంది పాసయ్యారు. బాలికలు 2604 మంది పరీక్షలు రాయగా, వారిలో 2055 మంది (78.92 శాతం)పాసయ్యారు. వొకేషనల్ కేటగిరీలో బాలురు 360 మంది పరీక్షలు రాయగా, 234 మంది (65.00 శాతం) పాసయ్యారు.
బాలికలు 424 మంది పరీక్షలు రాయగా 367 మంది (85.56 శాతం) పాసయ్యారు. ఇంటర్ ఫస్టియర్లో మొత్తం 5372 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 3240 మంది (60.31శాతం) పాసయ్యారు. వీరిలో జనరల్ ఇంటర్ కేటగిరీలో బాలురు 2424 మంది పరీక్షలు రాయగా, 1181 మంది (48.72 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 2948 మంది బాలికలు పరీక్షలు రాయగా వారిలో 2059 మంది (69.84 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్ కేటగిరీలో మొత్తం 888 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 511 మంది (57.55శాతం) ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 466 మందికి 222 మంది (47.64 శాతం), బాలికలు 422 మందికి 289 మంది (68.48 శాతం) ఉత్తీర్ణత సాధించారు.