ఆదిలాబాద్ టౌన్, మే 4 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందిస్తున్న ప్రభుత్వం.. తాజాగా నోటు పుస్తకాలు, వర్క్ బుక్స్ కూడా ఫ్రీగానే అందించాలని నిర్ణయించింది. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 60 వేల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఒక్కో విద్యార్థికి నోటు పుస్తకాలు, సామగ్రికి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఖర్చవుతోంది. నిరుపేదలకు భారం అవుతుండడంతో.. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం మానవతా ధృక్పదంతో నిర్ణయం తీసుకుంది. ఫలితంగా విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టే అవకాశం ఉందని, డ్రాపౌట్స్ కూడా తగ్గవచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
ర్గదర్శకాలు అందగానే పంపిణీ..
ప్రభుత్వ నిర్ణయంతో పాఠశాలల విద్య బలోపేతం అవుతోందని భావిస్తు న్నా. ప్రభుత్వ మార్గదర్శకాలు అందాల్సి ఉంది. రాగానే నోటు పుస్తకాలు, వర్క్బుక్స్ పంపిణీ చేస్తాం. బడులు ప్రారంభమయ్యే పక్షం రోజుల ముందు నుంచే కసరత్తు చేస్తాం. పాఠశాలలు తెరిచే నాటికి అన్ని సిద్ధం చేసుకుంటాం.
– ప్రణీత, జిల్లా విద్యాశాఖ అధికారి, ఆదిలాబాద్.
ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం..
ప్రభుత్వం ఉచితంగా నోటు పుస్తకాలు అందజేయడం అభినందనీయం. విద్యార్థులకు కొనుగోలు చేసే శక్తి లేక ఒకటి లేదా రెండు పుస్తకాలతోనే కా లం వెళ్లదీస్తున్నారు. కొందరైతే నోట్ బుక్స్ లేక రాసుకోలేక పోతున్నారు. ఉపాధ్యాయులు ఏమై నా అంటారేమోనని బడికి సక్రమంగా రావడం లేదు. ఉచిత నోటు పుస్తకాల పంపిణీ వల్ల విద్యా ర్థుల హాజరు శాతం పెరిగే అవకాశం ఉంది.
– జలంధర్రెడ్డి, టీయూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి