దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అపరిష్కృత సమస్యలకు పరిష్కారం లభించనుంది. గిరిజనులు, గిరిజనేతరులు ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి సర్కారు సన్నాహాలు చేస్తున్నది. భూముల సర్వేను అటవీ, రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శి, అటవీ హక్కుల కమిటీ సభ్యులు, స్థానిక రైతులతో కలిసి నిర్వహించారు.
ఈ గుర్తింపు ప్రక్రియ చివరి దశకు చేరుకోగా.. నవంబర్ నుంచి దరఖాస్తులు స్వీకరించింది. 66,004 మంది రైతులు 2,27,129 ఎకరాలు సాగు చేస్తున్నట్లు తేలగా.. దరఖాస్తులను అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. కాగా.. ఇందుకు సంబంధించి గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, సీఎస్ శాంతికుమారి ఇటీవల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టాల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. దీంతో గిరిజనులు, గిరిజనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– ఆదిలాబాద్, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అటవీ భూముల్లో వ్యవసాయం చేస్తున్న రైతులకు త్వరలో పట్టాలు అందనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. మూడు రోజుల కిందట గిరిజ న సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, సీఎస్ శాంతికుమారి ఇటీవల కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పట్టాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
అటవీ భూములను సాగు చేస్తున్న గిరిజన, ఇతర రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్య పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోడు వ్యవసాయం చేస్తు న్న గిరిజనులు, ఇతర రైతుల నుంచి గతేడాది నవంబరులో దరఖాస్తులు స్వీకరించారు. అటవీ హక్కు పత్రాల పంపిణీలో భాగంగా గ్రామాల్లో అటవీశాఖ బీట్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలు పర్యటించి ఫారెస్ట్ రైట్స్ కమిటీ సభ్యుల సమక్షంలో దరఖాస్తులు ఎలా చేసుకోవాలనే విషయం లో అవగాహన కల్పించి, సంబంధిత పత్రాలతో క్లెయిమ్స్ తీసుకున్నారు.
66 వేల మంది దరఖాస్తుల అందజేత
అటవీ హక్కు పత్రాల పంపిణీలో భాగంగా జిల్లాలవారీగా కమిటీలను ఏర్పాటు చేసి అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం జిల్లా కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా ఇన్చార్జి మంత్రి చైర్మన్గా, కలెక్టర్ కన్వీనర్గా, జిల్లా ఉన్నతాధికారులు అధికారిక సభ్యులుగా, ప్రజాప్రతినిధులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 38 మండలాల్లో 248 పంచాయతీల్లోని 711 గ్రామాల్లో పోడు భూములను గిరిజనులు, ఇతర రైతులు సాగు చేస్తుండగా.. 66,004 మంది రైతులు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు జిల్లాల్లో 2,27,129 ఎకరాల అటవీ భూములను సాగు చేస్తున్నట్లు దరఖాస్తుదారులు సూచించారు. ఉమ్మడి జిల్లాలో 33,885 మంది గిరిజన రైతులు 1,24,522 ఎకరాలు, 32,119 మంది ఇతర రైతులు 1,02,507 ఎకరాలకు గాను హక్కు పత్రాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో 11,172 మంది గిరిజనులు 44,120 ఎకరాలకు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 13,177 మంది 51,859 ఎకరాల కు, నిర్మల్ జిల్లాలో 5,076 మంది 14,955 ఎకరాలకు, మంచిర్యాల జిల్లా లో 4,460 మంది రైతులు 13,587 ఎకరాల కోసం దరఖాస్తులు అందజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 7,172 మంది ఇతర రైతులు 28,472 ఎకరాలకు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 13,503 మంది రైతులు 44,267 ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 3,590 మంది 10,037 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 7,314 మంది రైతులు 19,830 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గిరిజన, ఇతర రైతుల దరఖాస్తులను అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు.
పకడ్బందీగా సర్వే..
అటవీ భూములకు పట్టాల పంపిణీలో భాగంగా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. సర్వేలో భాగంగా అటవీ, రె వెన్యూ, పంచాయతీ కార్యదర్శి, అటవీ హ క్కుల కమిటీ సభ్యులు, స్థానిక రైతులతో కలి సి గ్రామాల్లో పర్యటించారు. దరఖాస్తు చేసుకున్న వారు ఎంత భూమిని సాగు చేస్తున్నారు. విస్తీర్ణం, నాలుగు దిక్కుల ఏ రైతులు ఉన్నారనే విషయాలను తెలుసుకున్నారు. అటవీశాఖ అధికారులు సర్వేలో భాగంగా యాప్ను ఉపయోగించి భూమి చుట్టు కొలత, నమోదవుతుండగా విస్తీర్ణం తెలుసుకున్నారు. దరఖాస్తులో ఉన్న కోడ్ నంబరు, రైతు పేరు, నమోదు చేసి ఫొటో తీసుకుని ఆన్లైన్లో నమోదు చేశారు. సర్వే అనంతరం గ్రామసభలు నిర్వహించారు.
మా కల నెరవేరుస్తున్నాడు..
నాకు నాలుగెకరాల పోడు వ్యవసాయ భూమి ఉంది. మా తాత తండ్రుల కాలం నుంచి ఈ భూమిని సాగు చేసుకుంటున్నాం. ప్రధానంగా వర్షాధార పంటలైన పత్తి, కంది పండిస్తాం. దీనిపై వచ్చే డబ్బుల తోనే బతుకుతం. గత పాలకులు పట్టా లిస్తామని చెప్పి ఇవ్వలేదు. కేసీఆర్ సీఎం అయ్యాక పట్టాలిస్తామని ప్రకటించారు. ఈ మధ్య నాగోబా దర్బార్లో కూడా మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్రెడ్డి త్వరలో ఇస్తామని చెప్పారు. ఫలితంగా సర్కారు అందించే రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అందుతాయి. సీఎం సారు చేయవట్టే మా దశాబ్దాల కల నెరవేరుతున్నది.
– కే భీంరావు పటేల్, ఆదివాసీ రైతు, జాకీర్గూడ, సిరికొండ.
రుణపడి ఉంటాం..
నాకు రెండెకరాల పోడు భూమి ఉంది. ఇది తాతల నుంచి సాగు చేస్తున్నాం. కానీ.. దీనికి గత ప్రభుత్వాలు పట్టాలివ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదివాసుల పోడు భూముల పట్టాల కోసం రెవెన్యూ, అటవీ శాఖ, పోడు భూముల కమిటీలతో మా భూములను సర్వే చేశారు. ఎక్కువ శాతం ఆదివాసులు పోడు భూములు సాగు చేసుకుంటూనే జీవనం గడుపుతున్నారు. ప్రభుత్వం పట్టాలిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే లాభాలన్నీ మాకు అందుతాయి. పోడు భూములకు పట్టాలిస్తే ఆదివాసులందరూ ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటారు.
– కుమ్రం యాదవ్రావు, ఆదివాసీ రైతు, కోసుగూడ, సిరికొండ.