బోథ్, డిసెంబర్ 13: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. మండలంలోని సాకెర గ్రామంలో మండల పరిషత్ నిధులు రూ.4లక్షలతో చేపడుతున్న డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారంప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల పర్యటన సందర్భంగా దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు వీలుగా మండల పరిషత్ నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అంతకుముందు ఎంపీపీని సర్పంచ్ శాలువాతో సన్మానించారు.
కార్యక్రమంలో సర్పంచ్ ధరావత్ మీరాబాయి, కుమార్సింగ్, సొసైటీ చైర్మన్ ప్రశాంత్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు బీ శ్రీధర్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.