మరో రెండు నెలల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశముం డగా, ప్రభుత్వం మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియను ముందుగానే మొదలు పెట్టింది. రెండేండ్ల (2023-25) పాటు వైన్స్లు నిర్వహించేందుకు ఈ నెల 4 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నది. 21న డ్రా పద్ధతిలో షాపులు కేటాయించనున్నది. జనాభాసంఖ్య కనుగుణంగా ఎక్సైజ్ స్లాబ్ రుసుము విధానాన్ని అమలు చేయనున్నది. గతేడాదిలాగే ఎస్సీ, ఎస్టీలతోపాటు గౌడ కులస్తులకు రిజర్వేషన్ కల్పించనుండగా, గతంలో కంటే పోటీ ఎక్కువగా ఉండనున్నది.
– నిర్మల్ అర్బన్, ఆగస్టు 3
నిర్మల్ అర్బన్,ఆగస్టు 3: మద్యం దుకాణాల టెం డర్ల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇం దుకు సంబంధించి బుధవారం ఉత్తర్వులు జారీ చేయగా, శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 2021-23 దుకాణాల కాలపరిమితి న వంబర్తో ముగియనుండగా మూడు నెలల ముం దుగానే ప్రభుత్వం టెండర్లను నిర్వహించడంతో ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఆశావాహులకు ప్ర భుత్వం కిక్కులాంటి శుభవార్తను చెప్పింది. దీం తో ప్రస్తుతం మద్యం దుకాణం నిర్వహిస్తున్న వ్యా పారులతో పాటు గతంలో లక్కీడ్రాలో అదృష్టం వరించని వారు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం గత రెండేళ్ల క్రితం ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్థులకు ప్రత్యేక రిజర్వేషన్ సదుపాయం కల్పిచగా ఈ సారి కూడా అదేవిధంగా టెండర్ల ప్రక్రియ నిర్వ హించనుంది. ఈ ఏడాది గతం కంటే పెద్ద సం ఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 47 మద్యం దుకాణాలు..
నిర్మల్ జిల్లాలో 19 మండలాలు ఉండగా, రెండు ఎక్సైజ్ స్టేషన్లు నిర్మల్, భైంసాలో ఉన్నాయి. వీటి పరిధిలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 47 మద్యం దు కాణాలు ఉన్నాయి. వీటిలో మూడు మద్యం దు కాణాలను గౌడ, 5 దుకాణాలు ఎస్సీలకు కేటాయించనున్నారు. ఈ ఎనిమిది మద్యం దుకాణాలకు కేవలం ఈ కులస్థులు మాత్రమే దరఖాస్తు చే సుకునే అవకాశం ఉంది. మిగతా 39 మద్యం దు కాణాలకు ఏ కులస్థులైన తమ దరఖాస్తులను స మర్పించుకోవచ్చు. ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మద్యం విక్రయాలు భారీ స్థా యిలో ఉండే అవకాశం ఉంది. దీంతో పెద్ద సంఖ్య లో ఆశావాహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఒక్కో దుకాణానికి రూ.2 లక్షల ఫీజు
జిల్లాలోని 47 మద్యం దుకాణాల్లో రిజర్వ్ దుకాణాలు మినహా ఒక్కో వ్యక్తి ఒక్కో దుకాణానికి ఎ న్ని దరఖాస్తులనైనా సమర్పించవచ్చు. జిల్లా కేం ద్రంతో పాటు రాష్ట్రంలోని 2620లోని ఏ మద్యం దుకాణానికైనాన టెండర్ వేయవచ్చు. ఒక్కో దరఖాస్తుకు గతంలో మాదిరిగానే రూ.2 లక్షలు ( నా న్ రిఫండెబుల్) నిర్ణయించారు. దరఖాస్తు ఫీజులను రూ. 2 లక్షల డీడీతోగాని, చలాన్ రూపంలో గాని చెల్లించవచ్చు. దరఖాస్తులను జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుం చి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు.
మూడు నెలల ముందుగానే..
నూతన ఎక్సైజ్ పాలసీ 2023-25 ప్రకారం న వంబర్ నెలలో నోటిఫికేషన్ రావాల్సి ఉండగా, ప్రభుత్వం ఆగస్టు నెలలోనే ఈ ప్రక్రియను ప్రారంభించడంతో టెండర్లలో పాల్గొనే ఆశావహులకు మూడు నెలల ముందుగానే అదృష్టం దక్కనుందని సంబురపడుతున్నారు.