నిర్మల్ అర్బన్, అక్టోబర్ 10 : ఎన్నికల ప్రచారం షురూ అయ్యింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టి, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని హ్యాటిక్ మంత్రిగా గెలిపించాలని కోరుతూ గుల్జార్ మార్కెట్ కౌన్సిలర్ తౌహీదుద్దీన్ ప్రచారం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, అల్లోల ఫొటోలతో ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల పోస్టర్లను అతికిస్తూ ప్రచారం ప్రారంభించారు. అభివృద్ధి చేస్తున్న పార్టీలకే పట్టం కట్టాలని, మోసపూరిత హామీలు ఇస్తూ ఇబ్బందులకు గురిచేసే పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. కాగా, కౌన్సిలర్ను పార్టీ వర్గాలు అభినందిస్తున్నాయి.