కుంటాల, మే 24 : బీఆర్ఎస్ హయాంలోనే ఆలయాలు అభివృద్ధి చెందాయని, ప్రభుత్వం కో ట్లాది నిధులు వెచ్చించి అన్ని ఆలయాలను పునర్నిర్మిస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అ న్నారు. మండలంలోని విఠాపూర్ గ్రామంలో ముత్యాలమ్మ, చంద మహంకాళి, మహాలక్ష్మీ ఆలయాల పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే బుధవారం భూమిపూజ చేశారు. రూ.14.10 లక్షల సీజీఎఫ్ నిధులు, గ్రామస్తుల విరాళం రూ.3.60 లక్షలు కలిపి మొత్తం సుమారు రూ.18.50 లక్షలతో ఆలయాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆలయ నిర్మాణానికి భూమి విరాళంగా ఇచ్చిన దాత సిందే గణపతి రావును ఎమ్మెల్యే అభినందించారు. పీఏసీఎస్ చైర్మన్ సట్ల గజ్జారాం, సర్పంచ్ లక్ష్మి-రమేశ్, ఉప సర్పంచ్ నవీన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొత్తపల్లి బుచ్చన్న, అందకూర్ ఎంపీటీసీ మధు, భూదాత సిందే గణపతి రావు, వీడీసీ అధ్యక్షుడు సీహెచ్ అశోక్, మాజీ సర్పంచ్ విఠల్ రావు పాటిల్, ఉప సర్పంచ్ నవీన్ రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కిష్టయ్య, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు ఒడ్నం అనిల్ కుమార్, బీఆర్ఎస్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు పురుషోత్తం, పంచాయతీ కా ర్యదర్శి కవిత పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
పెంచికల్పాడ్ గ్రామంలో లబ్ధిదారులు కీని సాయవ్వకు రూ.24 వేలు, జాదవ్ లక్ష్మికి రూ. 68 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. సర్పంచ్ భోజాబాయి, మాజీ జడ్పీటీసీ కొత్తపల్లి బుచ్చన్న, ఉప సర్పంచ్ కిష్టయ్య, మాజీ సర్పంచ్ చంద్రకాంత్, నాయకులు దిగంబర్, పురుషోత్తం పాల్గొన్నారు.
క్రీడాకారులకు సన్మానం
భైంసాటౌన్, మే 24 : ఇటీవల నిర్వహించిన సీఎం కప్ 2023 క్రీడా పోటీల్లో జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపికైన భైంసా ఫుట్బాల్ జట్టును ఎమ్మెల్యే విఠల్ రెడ్డి దేగాంలో సన్మానించారు. ఇటీవల రష్యా రాజధాని మాస్కోలో నిర్వహించిన వుషూ పోటీల్లో రెండు బ్రాంజ్ మెడ ల్స్ సాధించిన బాసర మండలం సాలాపూర్కు చెందిన సద్దాం హుస్సేన్ను ఎమ్మెల్యే సన్మానించా రు. పట్టణ ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ సద్దాం హు స్సేన్ను భైంసా పోలీస్స్టేషన్లో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శివశంకర్, సంతోష్, రఘువీర్, గణేశ్, యోగేశ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
భైంసాటౌన్, మే 24 : సర్వీసు క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సమక్షంలో ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, బీఆర్ఎస్ నాయకులు సోలంకి భీంరావు, చౌహాన్ శంకర్, బుచ్చన్న, వైస్ ఎంపీపీ గంగాధర్, సర్పంచ్ సంజీవ్ రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు గజానంద్, సర్పంచ్ దత్తుగౌడ్ పాల్గొన్నారు.