రేషన్ కార్డుల్లోని లబ్ధిదారులందరూ ఈ కేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ప్రక్రియను 15 రోజులుగా చౌకధరల దుకాణాల్లో డీలర్లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చాలా చోట్ల లబ్ధిదారులు వేలిముద్రలు పడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు చదువులు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో ఉండడంతో సకాలంలో చేయించుకోలేకపోతున్నారు. మరికొందరు ఆధార్లో అప్డేట్ చేసుకునేందుకు మీసేవ, ఆధార్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. పారదర్శకత, బోగస్ లబ్ధిదారుల ఏరివేతలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినా, ప్రస్తుతం తలెత్తుతున్న సాంకేతిక సమస్యలతో తమ పేర్లు తొలగిస్తారేమోనని రేషన్కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు.
– ఆదిలాబాద్, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, సెప్టెంబరు 27 (నమస్తే తెలంగా ణ): ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం పేదలకు ఉచితంగా బియ్యం బియ్యం చేస్తున్నది. కుటుంబంలో ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున ప్రతి నెలా రేషన్ దుకాణాల్లో బియ్యం అందు తున్నది. జిల్లా వ్యాప్తంగా 356 రేషన్ దుకాణాలు ఉండగా, 1,91,889 రేషన్కార్డులు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి నెలా 6,40,681 మంది లబ్ధి దారులకు 4083.95 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నది.
ఇందులో ఆహార భద్రతా కార్డులు 1,77,469 ఉండగా ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల చొప్పున 579490 మంది లబ్ధిదా రులకు ప్రతి నెలా 3584.94 మెట్రిక్ టన్నులు, అంత్యోదయ కార్డులు 14,170 ఉండగా ప్రతి కార్డుకు 35 కిలోల చొప్పున 42937 మంది లబ్ధిదా రులకు ప్రతి నెల 495.95 మెట్రిక టన్ను లు, అన్నపూర్ణ కార్డులు 250 ఉండగా ప్రతి ఒక్క రికీ 10 కిలోల చొప్పున 2,500 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వం అందజేస్తున్నది. పేదలు కడుపునిండా భోజనం చేయడంతో పాటు వారిలో రక్తహీనత సమస్య నివారణ, ఐరన్, విట మిన్, ఫొలిక్ యాసిడ్ 12, మంచి పోషక విలువలు కలిగి న ఫొర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేస్తున్నది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పేదలకు ఎంతో ఉపయోగపడు తుంది.
కేంద్రం నిర్ణయంతో లబ్ధిదారుల్లో ఆందోళన
రేషన్దుకాణాల్లో బియ్యం తీసుకుంటున్న వారు కేవైసీ చేయించుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కార్డులో పేర్లున్న వారందరూ రేషన్ దుకాణాలకు పోయి డీలర్ల వద్ద ఉన్న ఈ పాస్ యంత్రాల్లో వేలిముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది. కేవైసీ ఎప్పటిలోగా చేయించుకోవాలి. వేలిముద్రలు పడకపోతే ఏమి చేయాలి. ఇతర విషయాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు అయోమయానికి గురువుతున్నారు. ఆధార్ కార్డు లు పాతవి కావడంతో కొందరి వేలిముద్రలు సరిపోవడం లేదు. ఆధార్ నమోదు చిన్న పిల్లల వేలిముద్రలు, ఐరిస్ తీసుకోరు. కేంద్ర నిర్ణయంతో వారు రేషన్ దుకాణానికి పోయి వేలి ముద్రలు ఎలా వేయాలనే విషయంలో తల్లిదండ్రులు ఆందో ళన చెందుతున్నారు.
రేషన్ డీలర్లుకు సైతం ఈ విషయంలో స్పష్టత లేకపోవడంతో ఏమి చేయని పరిస్థితి ఉంది. వేలి ముద్రలు సరిపోని వారు, ఆధార్ కార్డుల అప్డేట్ చేయించుకునేందుకు కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. దీంతో ఆధా ర్ కేంద్రాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. కార్డుల్లో పేర్లు ఉన్న వారు చదువులు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. వారి సైతం కైవేసీ చేయించుకోవడం కష్టంగా మారింది. ఆధార్ కేంద్రాల్లో రద్దీ ఎక్కువ కావడంతో రేషన్కార్డుల లబ్ధిదారులకు కుటుంబసభ్యులతో కలిసి పలు కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సకాలం లో చేయించుకోకుంటే పేర్లు కట్ చేస్తారనే ఊహా గానాల నేపథ్యంలో లబ్ధిదారులు భయాందోళనకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తమను ఇబ్బందులు చేసే విధంగా ఉందని పేదలు మండి పడుతున్నారు.