ముథోల్, డిసెంబర్ 3 : దివ్యాంగులు మానసిక ైస్థెర్యాన్ని కోల్పోవద్దని నిర్మల్ డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. ముథోల్లోని భవిత కేంద్రంలో శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. పోషకులు సైతం దివ్యాంగ పిల్లలను వెన్నంటే ప్రోత్సహించాలని సూచించారు. దివ్యాంగుల కోసం ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, మండల విద్యాధికారి మైసాజీ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఏపీవో శిరీష, డీఏపీఎం అడ్డిగ బోస్, డీపీఎం రాజేశ్వర్, శోభ, విజయలక్ష్మి, ఏపీడీ గోవింద్ రావ్, ఏపీఎంలు అశోక్, నారాయణ రెడ్డి, అర్జుబాయి, సూర్యకాంత్, సీబీవో ఎడిటర్ పోశెట్టి, సీసీలు, ఉపాధ్యాయులు, పోషకులు పాల్గొన్నారు.