ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం ప్రజలు సంబురంగా జరుపుకున్నారు. రైతులు ఉదయాన్నే తమ పంటపొలాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఎద్దులను అలంకరించి దుక్కిదున్ని వ్యవసాయ పనులను ప్రారంభించారు. ఈ ఏడాది పంటలు బాగా ఉండాలని వేడుకున్నారు. ఇంట్లో తీపి వంటకాలు చేసి కుటుంబ సభ్యులతో కలిసి అరగించారు.
ఎదులాపురం, ఏప్రిల్ 9 : ఆదిలాబాద్లోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం వద్ద సనాతన హిం దూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భక్తులకు ఉగాది పచ్చడి అందజేశారు. అదే విధంగా ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకొని పేద మహిళలకు చీరె లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మఠాధిపతి శ్రీ యోగానందద సరస్వతి స్వామి, ప్రముఖ వ్యాపారవేత్త ప్రకాశ్రెడ్డి, సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, ప్రముఖులు, సమితి సభ్యులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణంలో మాజీమంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. వేద పండితులతో ఉగాది పంచాంగ శ్రావణ పూజను ప్రారంభించి కార్యకర్తలకు ఉగాది పచ్చడిని అందజేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అజయ్, కౌన్సిలర్లు భారత్కుమార్, రామ్కుమార్, మిష్ణు, నాయకులు విజ్జగిరి నారాయణ, రమేశ్, ఆశన్న, మిట్టపూరే యోగేశ్, మమత పాల్గొన్నారు.
వినాయక్చౌక్ వద్ద శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ హాజరయ్యారు. ముందుగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి పూజలు చేశారు. అనంతరం ప్రజలకు ఉగాది పచ్చడి, గుడాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు భూమన్న, ప్రధాన కార్యదర్శి కోరెడ్డి లెనిన్, సంయుక్త కార్యదర్శి లస్మయ్య, సభ్యులు పాల్గొన్నారు.
నేరడిగొండ, ఏప్రిల్ 9: ఉగాది పండుగను పురస్కరించుకుని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ దంపతులు మండల కేంద్రంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాజురా గ్రామంలోని సంత్ శ్రీ సేవాలాల్, జగదాంబ దేవీ ఆలయాలను కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పొలంలో అరక పట్టి ప్రత్యేక పూజలు చేశారు.
బోథ్, ఏప్రిల్ 9 : బోథ్లోని నాగభూషణం పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది పచ్చడి కార్యక్రమాన్ని సీఐ రమేశ్ ప్రారంభించారు. సోనాలలో గ్రామస్తులు ఉగాది పచ్చడి తయారు చేసి పంపిణీ చేశారు.
ఉట్నూర్ రూరల్, ఏప్రిల్ 9: లక్కారం గ్రామంలో కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జూపటేల్ ప్రజలకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. శాలివాహన చక్రవర్తి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా పాత ఉట్నూర్ లోని రామాలయంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్ భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ పూజారి సంతోష్ దూబే, ఎంపీపీ పంద్ర జైవంత్రావ్, మాజీ సర్పంచ్ మర్సుకోల తిరుపతి, కుమ్మర సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్, ఏప్రిల్ 9: పండుగలతో ప్రజల్లో ఉత్సాహం పెరుగుతుందని ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ అన్నారు. మంగళవారం అంబేద్కర్ చౌక్లో సామాజిక కార్యకర్త కేశమ్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, వైస్ ఎంపీపీ బాలాజీ, ఆశన్న, నాయకులు పాల్గొన్నారు.
ఇచ్చోడ/ గుడిహత్నూర్/ బజార్హత్నూర్/ ఇంద్రవెల్లి/ నార్నూర్, ఏప్రిల్ 9 : ఇచ్చోడ, సిరికొండ, గుడిహత్నూర్, బజార్హత్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల్లో భక్తి శ్రద్ధలతో ఉగాది సంబరాలు నిర్వహించారు. రైతులు ఉదయాన్నే వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు.
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 9 : పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అకాడమీ డైరెక్టర్ దన్రాజ్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, రాము, గంగాధర్, కౌన్సిలర్లు నవీన్ ఉన్నారు.
నిర్మల్ పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్లో వేదపండితులు చక్రపాణి నర్సింహా చార్యులచే హోమం, పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి వితరణ, ఆద్యాత్మిక ప్రవచనాలు వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం నారాయణ గౌడ్, అద్యక్షులు డాక్టర్ కృష్ణం రాజు, భూమారెడ్డి, పోడెల్లి చిన్నయ్య, ఆమెడ శ్రీదర్, వేణుగోపాల కృష్ణ తదితరులున్నారు.
నిర్మల్లోని మున్నూరుకాపు మిత్ర మండలి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణను సంఘ సభ్యులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జాతీయ విత్తన శుద్ది డైరెక్టర్ అయ్యన్నగారి భూమ య్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేం దర్, మిత్ర మండలి అద్యక్షుడు పుప్పాల రమేష్, ప్రదాన కార్యదర్శి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
భైంసా, ఏప్రిల్, 9 : సాన్ గల్లి మహాదేవ్ మందిరంలో పచ్చడితో పాటు పంచాంగ శ్రవణం నిర్వహించారు. హిందూవాహిని, సత్యసాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ పచ్చడి పంపిణీ చేశారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్, తూమోల్ల దత్తాత్రి, శ్రీనివాస్, డా. పోశెట్టి, డా. రామకృష్ణ గౌడ్, సత్యసాయిబాబా ట్రస్ట్ సభ్యులు శ్రీనివాస్, సూరి, శ్రీనివాస్, మున్నాలడ్డా, నాయకులు పోశెట్టి, గౌతం పింగ్లే, శ్రీనివాస్, ఉన్నారు.
పట్టణంలోని అల్ఫోర్స్ పాఠశాలలో ఉగాది వేడుకలను జరుపుకున్నారు. విద్యార్థులు పచ్చడిని తయారు చేసి పంచిపెట్టారు.
భైంసాటౌన్, ఏప్రిల్, 9: మండల వ్యాప్తంగా రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరకలతో తొలి దుక్కులు దున్నారు.
కుంటాల, ఏప్రిల్, 9 : కల్లూరులో హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. దత్త వెంకట సాయి ఆలయంలో పండితుడు ప్రకాష్ ఉగాది పంచాంగాన్ని చదివి వినిపించారు.
తానూర్, ఏప్రిల్, 09 : మండల కేంద్రంలో రైతు కుటుంబ సభ్యు లు అంబలి కలుషాలతో పొలాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన పనులకు శ్రీకారం చుట్టారు. ఆయా గ్రామాల ఆలయ ఆర్చకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బాసర, ఏప్రిల్ 9 : బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో పూజలను ఘనంగా నిర్వహించారు. బ్రహ్మ ముహుర్తంలో అమ్మవార్లకు వివిధ ఔషదులతో విశేష అభిషేకం, మహానీరాజన మంత్రపుష్ప సేవ పంచాంగ బ్రహ్మధ్వజ పూజలను ఆలయ వైదిక బృంధం ఆధ్వర్యంలో నిర్వహించారు.
బాసర సరస్వతీ అమ్మవారి సన్నిదిలో మంగళవారం ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ శర్మ ఆధ్వర్యంలో నూతన పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైధిక బృంధం, ఆలయ సిబ్బంది, ఉన్నారు.
ముథోల్, ఏప్రిల్, 9 : ముథోల్తో పాటు మండల వ్యాప్తంగా వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు భూమి పూజ నిర్వహించారు. అనంతరం స్థానిక హనుమాన్ ఆలయం వద్ద చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు పోతన్నయాదవ్, తాటివార్ రమేష్, రవి యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.
ఖానాపూర్, ఏప్రిల్ 9: పట్టణంలోని పలు ఆలయాల్లో వేదపండితులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. సాయిబాబా ఆలయం, శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, శ్రీమహాదేవ అన్నపూర్ణ ఆలయం, శ్రీ వేంకటేశ్వరాలయాల్లో అర్చకులు ప్రజలకు పంచాంగం వివరించారు. ప్రజా ప్రతినిధులు, భక్తులు, హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొన్నారు.
దస్తురాబాద్, ఏప్రిల్ 9 : మండల కేంద్రంలోని ఆలయాల్లో భక్తులు స్వామి వార్లను దర్శించుకోని ప్రత్యేక పూజలు చేసి మొక్కులను తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు నరేశాచార్యులు, కొండమా చార్యులు, వంశీ కృష్ణచార్యులు, రాజేశ్ పంతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, నూతన పంచాంగ పఠనం చేశారు.
సోన్, ఏప్రిల్ 9 : సోన్ మండల కేంద్రంతో పాటు పాక్పట్ల, మాదాపూర్, కడ్తాల్, సాకెర, గంజాల్, న్యూవెల్మల్, బొప్పారం, వెంగ్వాపేట్, రత్నాపూర్కాండ్లీ, డ్యాంగాపూర్, అక్కాపూర్, చిట్యాల్, తదితర గ్రామాల్లో అన్నదాతలు పంట చేనుల్లో పూజలు చేసి కొత్త పనులకు శ్రీకారం చుట్టారు.