ముథోల్, ఆగస్టు 29 : రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం చింతకుంట గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో రూ.26 లక్షలతో చేపడుతున్న గోదాం నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన పంటలు గోదాంలో నిల్వ చేసుకునేందుకు దోహదపడుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, సర్పంచ్ రాజేందర్ రెడ్డి, పీఏసీఎస్ సీఈవో సాయరెడ్డి, బ్రహ్మణ్గావ్ సర్పంచ్ రాంరెడ్డి, డైరెక్టర్లు, రైతులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు లక్ష్యంతో చదువుకోవాలి
భైంసా, ఆగస్టు 29 : విద్యార్థులు లక్ష్యంతో చదువుకోవాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలోని హరియాలి కన్వెన్షన్ హాల్లో ఆనందిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత సమగ్ర వ్యక్తిత్వ వికాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నస్థాయి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలని, అవరోధాలను చూసి ఆగిపోకుండా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం వ్యక్తిత్వ వికాస శిక్షకులు తిరునగరి శ్రీహరి విద్యార్థులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎస్పీ కిరణ్ ఖారే, ఆనందిత ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మణ్, పీఆర్టీయూ నాయకులు రామారావు, మున్నూరు కాపు ముథోల్ అధ్యక్షుడు రోళ్ల రమేశ్, ఎంఈవో సుభాష్, నాయకులు, ఆయా పాఠశాలల యజమానులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.