తానూర్, జనవరి 28 : దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని, అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు కృషిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని ఏల్వత్ గ్రామంలో ఏల్వత్ నుంచి ఖర్బలా వరకు రూ.54 లక్షలతో, ఏల్వత్ నుంచి ముథోల్ వరకు రూ.18 లక్షలతో మంజూరైన రోడ్డు పనులను ప్రారంభించారు. అలాగే ఆయా గ్రామాలకు చెందిన 75 మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.75లక్షల 8 వేల 7 వందల విలువ గల చెక్కులను అందించారు. అనంతరం బామ్ని గ్రామంలో రూ.20 లక్షలతో మంజూరైన జీపీ భవనానికి.., రూ.3 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ పనులకు భూమి పూజల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అనతికాలంలోనే గ్రామాలు, పట్టణాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా కళ్యాణలక్ష్మి లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఏల్వత్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు కదం సంతోష్ దిగంబర్పటేల్ అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హంగిర్గా సొసైటీ చైర్మన్ నారాయణ్రావుపటేల్, ఆత్మ చైర్మన్ పోతరెడ్డి, వైస్ ఎంపీపీ జెల్లావార్ చంద్రకాంత్, భైంసా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణ, మాజీ ఎంపీపీ బాషేట్టి రాజ న్న, సర్పంచుల సంఘం అధ్యక్షుడు తాడేవార్ విఠల్, మాజీ జట్పీటీసీ ఉత్తం బాలేరావ్, సోసైటీ ఉపాధ్యక్షుడు పసుల నాగ్నాథ్, మండల కోఆప్షన్ సభ్యుడు గోవింద్రావ్పటేల్, బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు చంద్రకాంత్యాదవ్, త హసీల్దార్ పీ వెంకటరమణ, మండలాభివృద్ధి అధికారి శ్రీనివాస్రావు, ఎస్ఐ విక్రమ్, ఎంపీవో మో హన్సింగ్, ఆర్ఐ గంగాధర్, సర్పంచులు బాషెట్టి లక్ష్మీబాయి, బొల్లిపెల్లి బాలాజీ, సంతోష్పటేల్, సాయినాథ్, జాదవ్ పుండ్లిక్, అబ్దుల్ గనీ, శ్యాంపటేల్, సొసైటీ డైరెక్టర్లు గజానంద్, సంతోష్, మాజీ సర్పంచులు జాదవ్ మాధవ్రావ్పటేల్, బాబుపటేల్, శివ్కుమార్, ఉప సర్పంచులు నయ్యూంఖాన్, సాయినాథ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్, పిప్పెర గోపాల్, చుక్కబొట్ల భోజన్న, పల్లె విఠల్, అఠల్ దేవిదాస్ కేశవ్, సాయినాథ్, సుభాష్, సంజుపటేల్, రాజారెడ్డి, శివపటేల్, లక్ష్మణ్పటేల్, భీంరావ్పవార్, హన్మండ్లు, లబ్ధిదారులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..
భైంసా, జనవరి 28 : ఆయా గ్రామాలకు చెందిన కుటుంబాలకు మండలంలోని దేగాంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రూ.5లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్రెడ్డి, ఎంపీటీసీ నర్సారెడ్డి, డైరెక్టర్ చాకెటి లస్మన్న, నాయకులు అమేంధర్రెడ్డి, ప్రతాప్సింగ్ ఉన్నారు.