ఇంద్రవెల్లి, డిసెంబర్ 22 : మన ఊరు – మన బడి కింద పాఠశాలలను అత్యుత్తంగా తీర్చిదిద్దు తామని, నిర్లక్ష్యం వహించకుండా ఉపాధ్యాయు లు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్బాషా పేర్కొన్నారు. మండలంలోని బుద్ధానగర్, హర్కా పూర్తండా గ్రామాల్లో మన ఊరు – మన బడి కింద ఎంపికైన పాఠశాలలను గురువారం తనిఖీ చేశారు. పాఠశాలలకు చెందిన పలు రకాల రికార్డు లు పరిశీలించారు. పాఠశాలల్లో పెండింగ్ లో ఉన్న పనులతోపాటు చేపట్టిన నిర్మాణ పనుల తోపాటు విద్యార్థులకు కల్పించే మౌలిక వసతుల కల్పనపై ఆరా తీశారు. పాఠశాలకు వెళ్లే మార్గం తోపాటు బుద్ధానగర్లో పారిశుధ్యం సరిగా లేకపో వడంతో గ్రామ పంచాయతీ ఈవో పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవోకు నోటీస్ జారీ చేసి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకు అదేశించారు. విద్యా ర్థులను కొన్ని ప్రశ్నలు అడిగి వారి నుంచి సమాధానాలు రాబ ట్టారు.
బోర్డుపై లెక్కలు చేయించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమ న్నారు. డీఈవో ప్రణీత, ఎంపీడీవో పుష్పలత, ఎంఈవో నారాయణ, ఏఈలు లింగన్న, రమేశ్, సర్పంచ్ రాథోడ్ సేవంతా బాయి, నాయ కులు ఆరీఫ్మీర్జా, సత్యా నంద్, రోహిదాస్, సంజీవ్, శివాజీ, తదితరులు పాల్గొ న్నారు. కాగా కెస్లాపూర్ నాగోబా ఆలయంలో జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్భాషా ప్రత్యేక పూజలు చేశారు. ఆయనను మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. నాగోబా జాతరతోపాటు ఆలయ చరిత్రను అడిగి తెలుసు కున్నారు. ఎంపీడీవో పుష్పలత, ఎంపీవో సంతోష్ కుమార్, ఏపీవో జాదవ్ శ్రీనివాస్, మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్ రావ్ పటేల్, నాగోబా ఆలయ పూజారి మెస్రం షేకు, పంచాయతీ కార్యదర్శి మహ్మద్ మోతేశాం పాల్గొన్నారు.