ఎదులాపురం, నవంబర్ 7 : జిల్లాలో టీడీ వ్యాక్సినేషన్ రెండు వారాల పాటు చేపట్టను న్నామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల లో సోమవారం ధనుర్వాతం, కోరింత దగ్గు వ్యా ధి నిరోధన టీకా పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో టీడీ వ్యాక్సినేషన్ ఈ నెల 7 నుండి 19వ తేదీ వరకు ఐదో, పదో తరగతి విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు.
10 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఈ టీకా వేయిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో 928 పాఠశాలల్లోని 27,905 మంది విద్యార్థుల కు ఆయా పాఠశాలల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల మెడికల్ ఆఫీసర్లు, ఇతర టీమ్ల వ్యాక్సిన్ అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, జిల్లా ఇమ్యూనై జేషన్ అధికారి వైసీ శ్రీనివాస్, డిప్యూటీ డీఎం హెచ్వో డాక్టర్ సాధన, వార్డు కౌన్సిలర్ ప్రకాశ్, శాంతినగర్ యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్, సిబ్బంది, కేమ రాజారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.