గోదావరిఖని, మార్చి 23: టీబీజీకేఎస్ కార్మికుల హక్కుల సాధన కోసం రెండు దశాబ్దాలుగా పోరాడుతున్నదని, ఆ సంఘాన్ని అంతం చేయడం ఎవరి తరం కాదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి అన్నారు. శనివారం గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సంఘం నేత నూనె కొమురయ్య అధ్యక్షతన జరిగిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాజకీయాలకు అతీతంగా కార్మిక సంఘాన్ని పునర్నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కార్మికుల కోసం పనిచేయడం లేదని విమర్శించారు. గుర్తింపు సంఘంగా పనిచేసిన 11 ఏళ్ల కాలంలో 75 కార్మిక హక్కులను సాధించామన్నారు.
టీబీజీకేఎస్ కేంద్ర అధ్యక్షుడు బీ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్య రాజీనామాలు చేయగా, వర్కింగ్ కమిటీ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక్కడ 11 డివిజన్ల నుంచి యూనియన్ నాయకులు మల్రాజ్ శ్రీనివాస్రావు, మేడిపల్లి సంపత్, బడికల సంపత్కుమార్, పెట్టం లక్ష్మణ్, రాజశేఖర్, మంగీలాల్, వడ్డెపల్లి శంకర్, జహీద్పాషా, పర్లపల్లి రవి, మాదాసి రామమూర్తి, ఐలీ శ్రీనివాస్, సంపత్రెడ్డి, నాగేశ్వర్రావు, సమ్మయ్య, కాపు కృష్ణ, కిరణ్కుమార్ మురళి ఉన్నారు.