సోన్, సెప్టెంబర్ 10 : స్వచ్ఛ గురుకుల్లో భాగంగా వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, విద్యార్థులు బాగా చదువుకొని ఆణిముత్యాలుగా తయారవ్వాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్ గురుకుల పాఠశాలలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు సంస్కారం ముఖ్యమని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో వెయ్యి వరకు ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. ఇలా పాఠశాలలు పెరగడం వల్ల ప్రతి విద్యార్థి చదువుకోవడంతో తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుతున్నాయన్నారు. గతంలో రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి వరకు ఉండేదని, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఇంటర్ వరకు చదువుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. ప్రతి విద్యార్థి అడ్మిషన్ పొందినప్పుడే ఒక మొక్క నాటి ప్రతిరోజూ నీరుపోసి సంరక్షిస్తే చదువు పూర్తయ్యే వరకు ఆ మొక్క చెట్టుగా తయారై తీపి గుర్తుగా ఉండిపోతుందన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు మంత్రి తిలకించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జీవన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, సారంగాపూర్ ఎంపీపీ మహిపాల్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, ఆర్డీవో తుకారాం, తహసీల్దార్ హిమబిందు, ప్రిన్సిపాల్ సరస్వతి, సర్పంచ్లు మమత, గంగారెడ్డి, వినోద్, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్రెడ్డి, ఎంపీడీవో సాయిరాం, పీఏసీఎస్ డైరెక్టర్ మధుకర్రెడ్డి, లెంక బుచ్చన్న, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
సారంగాపూర్, సెప్టెంబర్ 10 : మండలంలోని దుప్యాతండా గ్రామానికి చెందిన చౌహాన్ జీపీబాయి, బీరవెల్లి గ్రామానికి చెందిన లక్కడి లక్ష్మి, నల్ల రత్నవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులను శనివారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ అట్ల మహిపాల్ రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ చందు, డీసీసీబీ డైరెక్టర్ నారాయణ రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపల్లి మాధవరావు, మండల ఇన్చార్జి అల్లోల మురళీధర్ రెడ్డి, సోన్ జడ్పీటీసీ జీవన్ రెడ్డి, సర్పంచ్లు ప్రహ్లద్, రవీందర్ రెడ్డి, నాయకులు రాజేశ్వర్రావు, భోజారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి ఉన్నారు. అనంతరం దుప్యాతండాలో గణేశుడి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.