కాసిపేట, డిసెంబర్ 28 : తెలంగాణ రాష్ట్ర జూనియర్ అటవీ అధికారుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఏ సుభాష్ ఎన్నికయ్యారు. గురువారం మందమర్రిలోని ఇల్లందు క్లబ్లో రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రశాంత్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. జనరల్ సెక్రెటరీగా అబ్దుల్ అజార్, వైస్ ప్రెసిడెంట్గా లాల్బాయి, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా బీ. ప్రవీణ్ నాయక్, జాయింట్ సెక్రెటరీగా ఎం.జ్యోతి, కోశాధికారిగా పీ. సతీశ్ ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన కమిటీకి అటవీశాఖ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. తమను ఎన్నుకున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఫారెస్ట్ అధికారుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ప్రకటించారు. ఎన్నికల పరిశీలకుడు ముసావీర్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరేశ్, కృష్ణ, ప్రవీణ్ మహాజన్ పాల్గొన్నారు.