బేల, నవంబర్ 30 : విద్యార్థులకు డిగ్రీ వారి జీవితాన్ని తీర్చిదిద్దే మైలురాయి అని, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి వారి జీవిత గమ్యాన్ని చేరుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. బేల మండల కేంద్రంలోని కీర్తన డిగ్రీ కళాశాలలో బుధవారం ఘనంగా ఫ్రెషర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథులుగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ గొడాం నగేశ్, ఆదిలాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా జ్యోతి ప్రజ్యోలన చేసి కార్యక్రమాన్ని ప్రారం భించారు. సమావేశంలో ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యానికి అనుగుణంగా ముందుకెళ్లి శిఖరాలను అధిరోహిం చాలని పేర్కొన్నారు.
బేలలోనే డిగ్రీ విద్యార్థులకు పరీక్షా కేంద్రంతో పాటు, మరాఠీ బాషాలో పరీక్ష రాసేలా చూడాలని బేల కళాశాల ప్రిన్సిపల్ వరప్రసాద్రావు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే ఉన్నత ఆధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కారిస్తామని హామీమి ఇచ్చారు. అనంతం అతిథులను శాలువాతో పాటు జ్ఞాపికలు అందించి సన్మానించారు. అనం తరం కళాశాల విద్యార్థులు నిర్వహించిన నృత్యా లను తిలకించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ పవన్కుమార్ అగర్వాల్, తాంసి జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, మండల నాయకులు గంభీర్ ఠాక్రే, సతీశ్ పవర్, ప్రమోద్రెడ్డి, వట్టిపెళ్లి ఇంద్ర శేఖర్, ఎస్ఐ కృష్ణ కుమార్, ఆయా గ్రామా ల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కళాశాల ప్రిన్సిపల్ వరప్రసాద్రావు, అధ్యాపకులు ప్రవీణ్, అనిల్, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
నేరడిగొండ, నవంబర్ 30 : నేరడిగొండ జడ్పీటీసీ జాదవ్ అనిల్ అన్న ఏఎస్ఐ జాదవ్ శ్యాంరావ్ అనారోగ్యంతో మృతి చెందడంతో బాధిత కుటుంబాన్ని రాజురా గ్రామంలో ఆదిలా బాద్ ఎమ్మెల్యే జోగురామన్న, మాజీ ఎంపీ గొడాం నగేశ్ పరామర్శించారు. శ్యాంరావ్ మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆయన వెంట బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, జడ్పీటీసీలు, పార్టీ నాయకులు ఉన్నారు.
వైస్ ఎంపీపీకి సన్మానం
ఎదులాపురం, నవంబర్ 30 : ఇటీవల ఆదిలా బాద్ గ్రామీణ వైస్ ఎంపీపీగా ఎన్నికైన కుమ్ర జంగు పటేల్ఎమ్మెల్యే జోగు రామన్నను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ను శాలువా, పుష్పగుచ్ఛాలు అందించి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. వైస్ ఎంపీపీని శాలువాతో సత్కరించి ఎమ్మెల్యే మండలాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. ఎంపీపీ గండ్రత్ రమేశ్, కుమ్ర జంగు బాపు, ఎంపీటీసీ కొముర రాజు, మడావి కిషన్, గెడాం రాము, పెందుర్తి గంగారాం, మహేందర్ పాల్గొన్నారు.