ఆదిలాబాద్ రూరల్, జనవరి 6 : ప్రతి ఒక్క విద్యార్థికి కరోనా టీకా వేయించాలని సెక్టోరల్ అధికారి జీ నారాయణ అన్నారు. పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో 15 ఏండ్లు నిండిన విద్యార్థులందరికీ కరోనా టీకా వేసే కార్యక్రమాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్, కేజీబీవీ, మోడల్ స్కూల్, ఆశ్రమ పాఠశాలలన్నింటిలోనూ కరోనా టీకా వేసే కార్యక్రమం ఎంతో చురుగ్గా సాగుతుందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి కరోనా టీకా వేసుకునేలా ప్రధానోపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గౌడ్, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 15నుంచి 18 ఏండ్లలోపు వారికి గురువారం వ్యాక్సిన్ వేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, టీకాతో కరో నా వైరస్ను నియంత్రించవచ్చని పాఠాశాల ప్రధానోపాధ్యాయుడు కోల నర్సింహులు పేర్కొన్నారు. కీర్తన డిగ్రీ కళాశాలలోనూ వ్యాక్సిన్ వేశా రు. వైద్య సిబ్బంది, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వరప్రసాద్ రావు, ఉపాధ్యాయులు అని ల్, భూమన్న, సోనేరావు, జయకర్ పాల్గొన్నారు.
బోథ్ మోడల్ స్కూల్లో..
బోథ్లోని మోడల్ స్కూ ల్ విద్యార్థులకు గురువారం కరోనా టీకాలు వేశారు. సొనాల పీహెచ్సీ డాక్టర్ కే నవీన్రెడ్డి ఆధ్వర్యంలో 15 నుంచి 18 సంవత్సరాల్లోపు ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులకు వ్యాక్సిన్ ఇచ్చారు. ప్రిన్సిపాల్ ఉమేశ్రావు, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటలక్ష్మి, స్టాఫ్నర్స్ చందన పాల్గొన్నారు.
ఇచ్చోడలో జోరుగా..
మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నది. ఇచ్చోడలోని కస్తుర్బాగాంధీ బాలికల పాఠశాల, మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం 15-18 ఏండ్ల వయసున్న వారికి టీకాలు వేశారు. కస్తుర్బాలో 99 మందికి, డిగ్రీ కళాశాలలో 45 మందికి టీకాలు వేశారు. ప్రిన్సిపాల్ డొంగ్రే తేమాజీ, మల్లిక, వైద్యాధికారులు ఆకుదారి సాగర్, జిలానీ, హెల్త్ అసిస్టెంట్ రాజ్ కిరణ్ రెడ్డి, రాథోడ్ కైలాశ్, జాదవ్ సుభాష్, ఉత్తం సింగ్, ఏఎన్ఎం సుధారాణి, సవిత, ఆశ వర్కర్ సునీత, ఉపాధ్యాయ సిబ్బంది లత, సవిత, కుసుమ, భారతి, జ్యోతి పాల్గొన్నారు.
భీంపూర్ మండలంలో..
తాంసి, భీంపూర్ మండలాల్లోని పీహెచ్సీలు, ఉన్నత పాఠశాలల్లో గురువారం 15-18 ఏళ్లలోపు విద్యార్థులకు టీకాలు వేశారు. తాంసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 18 ఏండ్లలోపు వారందరికీ వ్యాక్సినేషన్ వేస్తున్నారు. తాంసిలో జాతీయ సేవాపథకం ( ఎన్ఎస్ఎస్) వారు సహకారమందించారు. వైద్యాధికారులు శ్రీకాంత్, విజయసారథి పర్యవేక్షించారు.
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి
ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని మల్లాపూర్ సర్పంచ్ మడావి బాపురావ్ అన్నారు. మండలంలోని నిజాంగూడ గ్రామంలో గురువారం ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించారు. వ్యాక్సిన్తోనే కరోనాను నియంత్రించవచ్చన్నారు. కార్యదర్శి శ్రీధర్, వైద్యసిబ్బంది సుశీల పాల్గొన్నారు.
కరోనా కట్టడికి టీకా తప్పనిసరి
కరోనా కట్టడికి టీకా తప్పనిసరిగా వేసుకోవాలని సీహెచ్సీ హెచ్ఈవో చౌహాన్ నాందేవ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు గురువారం వ్యాక్సిన్ వేశారు. 15-18 ఏండ్లలోపు బాలబాలికలకు వ్యాక్సిన్ తప్పని ఇస్తామని తెలిపారు. బయటికి వెళ్లినప్పుడు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రిన్సిపాల్ ఉదయ్కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బాలాజీ కాంబ్లే, ఫార్మాసిస్ట్ మాయ, ఆరోగ్యపర్యవేక్షుడు ఈశ్వర్, సిబ్బంది, అధ్యాపకులున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఒమిక్రాన్ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని నార్నూర్ ఏఎస్ఐ గంగారెడ్డి అన్నారు. మండలంలోని శేకుగూడలో ప్రజలకు గురువా రం అవగాహన కల్పించారు. కరో నా థర్డ్వేవ్ ప్రభావాన్ని కట్టడి చేసేందుకు ప్రజలు సహకరించాలని సూచించారు. మాస్కు ధరించని వారికి రూ.1000 జరిమా నా విధిస్తామని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది తొడసం నాగోరావ్, గ్రామస్తులు పాల్గొన్నారు.