జైనథ్, మార్చి 19 : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని గిమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం పదో తరగతి హిందీ పరీక్ష జరుగుతున్నది. దాదాపు మధ్యాహ్నం 12.20 గంటలకు పైకప్పు కూలి(గూన పెంకల ఇల్లు) పరీక్ష రాస్తున్న విద్యార్థిని అక్షయ తలపై, విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్ పురుషోత్తంపై పడ్డాయి. అక్షయ తలకు గాయం కాగా.. పురుషోత్తంకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఇద్దరిని గిమ్మ పీహెచ్సీకి తరలించి చికిత్స అందించారు. ఈ విషయంపై కేంద్రం సీఎస్, ఏఈవోలను వివరాలు కోరగా సమాచారం లేదన్నారు.