నిర్మల్ టౌన్, జనవరి 6 : నిర్మల్లో ఈనెల 9 నుంచి 11వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్కు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. సైన్స్ఫేర్ నిర్వహణపై నిర్మల్ కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సహకారంతో నిర్మల్ జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్ నిర్వహిస్తున్నందున ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. విద్యార్థు
లు, ఉపాధ్యాయులకు అన్ని వసతులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిర్మల్కు సైన్స్ఫెయిర్రావడం ఎంతో గర్వకారణన్నారు. మంచి ఏర్పాట్లు చేసి సైన్స్ఫెయిర్ను విజయవంతం చేస్తే మరింత గుర్తింపు వస్తుందన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరై సైన్స్ఫెయిర్ ను ప్రారంభిస్తారని వివరించారు. 33 జిల్లాల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు రానున్నట్లు తెలిపారు. వీరి కోసం ప్రత్యేకంగా బస్సులు, నీటి సౌకర్యం, వైద్యం, విద్యుత్, రవాణా, భోజన, తదితర వసతులు కల్పించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని డీఈవో రవీందర్రెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, నిర్వాహకులు రాధ, జిల్లా శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఎస్టీయూ డైరీ విడుదల
నిర్మల్ అర్బన్, జనవరి 6 : విలువలతో కూడి న విద్యను అందించాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు.స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) డైరీని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూ ఖీ తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి సంఘం చేస్తున్న కృషిని కొనియాడారు. పేద విద్యార్థులకు ఉపయోగార్థం పెన్నుల బాక్సులను అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు జుట్టు గజేందర్, నాగభూషణ్, నాయ కులు భూమన్న యాదవ్, లక్ష్మణ్, వెంక టేశ్వర్ రావు, మసూద్, పోతన్న,అన్సర్అహ్మద్, ఇర్ఫాన్ షేక్ వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ వాల్ క్యాలెండర్ ను సీనియర్ అధ్యాపకుడు చంద్రకుమార్ విడు దల చేశారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు పీ.జీ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అజయ్, కళాశాల అధ్యక్షుడు అరుణ్ కుమార్లు ఉన్నారు.